పారిస్కు వరద రిస్క్
- January 27, 2018
పారిస్, ఫ్రాన్స్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్కు వరద ముప్పు పొంచి ఉంది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో నగరం గుండా వెళ్తున్న సీనే నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో వందల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ప్రమాదం జరిగితే ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని రోడ్లను ముందు జాగ్రత్తగా మూసివేశారు. సీనే నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటం ప్రజలను ఆందోళనలో పడేస్తోంది. మంగళవారం నది ఉప్పొంగి నీరు రోడ్లపైకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
విస్తారంగా కురిసిన వర్షాల కారణంగానే వరద ముప్పు వాటిల్లిందని పారిస్ అధికారులు వెల్లడించారు. సగటు వర్షపాతం ఈ ఏడాది సాధారణం కన్నా రెండు రెట్లు ఎక్కువగా నమోదైనట్లు చెప్పారు. వరద సంభవిస్తే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మ్యూజియం ‘లోవ్రో’లోకి కూడా నీరు వెళ్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







