రాజధానిలో భారీ పేలుడు... 49మంది దుర్మరణం

- January 27, 2018 , by Maagulf
రాజధానిలో భారీ పేలుడు... 49మంది దుర్మరణం

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో  49మంది చనిపోగా.. 150మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇండియన్ ఎంబసీకి సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ప్రజలంతా పనుల్లో నిమగ్నమై ఉండగా.. బాంబు పేలడంతో.. భారీగా ప్రాణ నష్టం సంభవించింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడటంతో.. సంఘటనా స్థలం భయానకంగా మారింది.

పేలుళ్లు జరిగిన వెంటనే భద్రతా బలగాలు సంఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించాయి. ఈ పేలుళ్లకు పాల్పడింది తామేనని తాలిబన్ సంస్థ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com