ఎమిరేట్స్ విమానంలో తోటి ప్రయాణికులను కంగారు పెట్టిన నైజీరియా ప్రయాణికుడు
- January 27, 2018
దుబాయ్: గాల్లోనికి విమానం ఎగరడమే కొందరికి రక్తపోటు పెరగడం సహజం...కానీ ఓ నైజీరియాకు చెందిన వ్యక్తి నానా యాగీ చేశాడు...తోటి ప్రయాణికులకు పట్టపగలే విమానంలో చుక్కలు చూపించాడు. ఇటీవల దుబాయ్ నగరం నుంచి చికాగో బయలుదేరిన ఎమిరేట్స్ విమానంలో 64 ఏళ్ల వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. మార్గమధ్యంలో అపరిచితుడిగా మారిపోయాడు. వింత చేష్టలతో విమానమంతా కలియ తిరిగేడు. పిచ్చిపట్టిన వ్యక్తిలా బిగ్గరగా అరుస్తూ విమాన సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ఎవరి మాటా లెక్కచేయలేదు. అతికష్టం మీద ప్రయాణికుడిని అదుపు చేసిన సిబ్బంది విమానం చికాగో చేరుకోగానే పోలీసు అధికారులకు ఆ వ్యక్తిని అప్పగించారు. బుధవారం తెల్లవారుజామున విమానంలో ఆ వ్యక్తి చేసిన హడావిడి అంతా వివరించారు. దీంతో ఆరోగ్య పరిస్థితుల దృష్టా హాస్పిటల్కు తరలించారు.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









