రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- January 29, 2018
మస్కట్: మస్కట్ గవర్నరేట్ పరిధిలోని కాంతాబ్ వద్ద ఓ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోగా, 23 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 60 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న బస్, కాంతాబ్ వద్ద ఓవర్ టర్న్ అయ్యింది. ఈ ప్రమాదంలో వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్కి కూడా తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 24 మంది ఉన్నారు. ఒమనీ డ్రైవర్ని మినహాయిస్తే, బస్సులో ఉన్నవారంతా భారతీయ వలసదారులేనని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. 19 మంది కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయని రాయల్ ఒమన్ పోలీసు వర్గాలు వెల్లడించాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







