రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- January 29, 2018
మస్కట్: మస్కట్ గవర్నరేట్ పరిధిలోని కాంతాబ్ వద్ద ఓ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోగా, 23 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 60 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న బస్, కాంతాబ్ వద్ద ఓవర్ టర్న్ అయ్యింది. ఈ ప్రమాదంలో వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్కి కూడా తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 24 మంది ఉన్నారు. ఒమనీ డ్రైవర్ని మినహాయిస్తే, బస్సులో ఉన్నవారంతా భారతీయ వలసదారులేనని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. 19 మంది కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయని రాయల్ ఒమన్ పోలీసు వర్గాలు వెల్లడించాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!
- వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారి పై విరిగిపడ్డ కొండచరియలు..!!
- వారంలో 5,111 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్
- డ్రగ్ టెస్టింగ్ నిబంధనలు పాటించనందుకు దుబాయ్లో వ్యక్తికి జైలుశిక్ష..!!
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’









