రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- January 29, 2018
మస్కట్: మస్కట్ గవర్నరేట్ పరిధిలోని కాంతాబ్ వద్ద ఓ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోగా, 23 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 60 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న బస్, కాంతాబ్ వద్ద ఓవర్ టర్న్ అయ్యింది. ఈ ప్రమాదంలో వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్కి కూడా తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 24 మంది ఉన్నారు. ఒమనీ డ్రైవర్ని మినహాయిస్తే, బస్సులో ఉన్నవారంతా భారతీయ వలసదారులేనని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. 19 మంది కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయని రాయల్ ఒమన్ పోలీసు వర్గాలు వెల్లడించాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి