శ్రీశైలం రహదారిపై ఇక రాత్రివేళ వాహనాల రాకపోకలు నిషేధం
- February 01, 2018
హైదరాబాద్ : నల్లమల అటవీ ప్రాంతమైన రాజీవ్ గాంధీ అభయారణ్యంలో రోడ్డు ప్రమాదాల బారినుంచి వన్యప్రాణుల పరిరక్షణ కోసం హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై వాహనాలు 40 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కవగా నడపరాదని తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.దీంతోపాటు రాత్రివేళ ఈ మార్గంలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. అటవీ ప్రాంతంలో జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న వాహనాల వల్ల పలు వన్యప్రాణులు మరణించిన నేపథ్యంలో కొత్తగా వాహనాల వేగనియంత్రణకు చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఇటీవల స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, వైద్యులు, ఇంజనీర్లతో జరిపిన వన్యప్రాణుల సర్వేలో వెల్లడైన వాస్తవాలతో ఇకనుంచి వన్యప్రాణుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీంతోపాటు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నల్లమల అటవీ ప్రాంతం గుండా వెళ్లే జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిషేధించాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









