శ్రీశైలం రహదారిపై ఇక రాత్రివేళ వాహనాల రాకపోకలు నిషేధం
- February 01, 2018
హైదరాబాద్ : నల్లమల అటవీ ప్రాంతమైన రాజీవ్ గాంధీ అభయారణ్యంలో రోడ్డు ప్రమాదాల బారినుంచి వన్యప్రాణుల పరిరక్షణ కోసం హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై వాహనాలు 40 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కవగా నడపరాదని తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.దీంతోపాటు రాత్రివేళ ఈ మార్గంలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. అటవీ ప్రాంతంలో జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న వాహనాల వల్ల పలు వన్యప్రాణులు మరణించిన నేపథ్యంలో కొత్తగా వాహనాల వేగనియంత్రణకు చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఇటీవల స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, వైద్యులు, ఇంజనీర్లతో జరిపిన వన్యప్రాణుల సర్వేలో వెల్లడైన వాస్తవాలతో ఇకనుంచి వన్యప్రాణుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీంతోపాటు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నల్లమల అటవీ ప్రాంతం గుండా వెళ్లే జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిషేధించాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!
- సలాలాలో కాల్పుల కలకలం..ఇద్దరికి గాయాలు..!!
- కీలక ఓవర్నైట్ రేటును 4.25% వద్దే పెట్టిన సీబీబీ..!!
- ఆర్థిక సహకారానికి ముందు ఇరాన్ విశ్వాసాన్ని పునరుద్ధరించాలి..!!
- యూఏఈ గ్రోసరీ బిల్లులు ఎప్పుడు తగ్గుతాయి?
- కువైట్ T4 కార్యకలాపాలు విస్తరణ..!!
- వేధింపులు భరించలేక షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా పై నిషేధం
- సాయికృష్ణ కేసుతో రాజకీయ కలకలం..జూన్ 29న హైకోర్టు డెడ్లైన్ పై ఉత్కంఠ!









