శ్రీశైలం రహదారిపై ఇక రాత్రివేళ వాహనాల రాకపోకలు నిషేధం
- February 01, 2018
హైదరాబాద్ : నల్లమల అటవీ ప్రాంతమైన రాజీవ్ గాంధీ అభయారణ్యంలో రోడ్డు ప్రమాదాల బారినుంచి వన్యప్రాణుల పరిరక్షణ కోసం హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై వాహనాలు 40 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కవగా నడపరాదని తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.దీంతోపాటు రాత్రివేళ ఈ మార్గంలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. అటవీ ప్రాంతంలో జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న వాహనాల వల్ల పలు వన్యప్రాణులు మరణించిన నేపథ్యంలో కొత్తగా వాహనాల వేగనియంత్రణకు చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఇటీవల స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, వైద్యులు, ఇంజనీర్లతో జరిపిన వన్యప్రాణుల సర్వేలో వెల్లడైన వాస్తవాలతో ఇకనుంచి వన్యప్రాణుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీంతోపాటు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నల్లమల అటవీ ప్రాంతం గుండా వెళ్లే జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిషేధించాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు