శ్రీశైలం రహదారిపై ఇక రాత్రివేళ వాహనాల రాకపోకలు నిషేధం
- February 01, 2018
హైదరాబాద్ : నల్లమల అటవీ ప్రాంతమైన రాజీవ్ గాంధీ అభయారణ్యంలో రోడ్డు ప్రమాదాల బారినుంచి వన్యప్రాణుల పరిరక్షణ కోసం హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై వాహనాలు 40 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కవగా నడపరాదని తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.దీంతోపాటు రాత్రివేళ ఈ మార్గంలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. అటవీ ప్రాంతంలో జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న వాహనాల వల్ల పలు వన్యప్రాణులు మరణించిన నేపథ్యంలో కొత్తగా వాహనాల వేగనియంత్రణకు చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఇటీవల స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, వైద్యులు, ఇంజనీర్లతో జరిపిన వన్యప్రాణుల సర్వేలో వెల్లడైన వాస్తవాలతో ఇకనుంచి వన్యప్రాణుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీంతోపాటు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నల్లమల అటవీ ప్రాంతం గుండా వెళ్లే జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిషేధించాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







