ఫిబ్రవరి 22 నుంచి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు కొత్త విద్యుత్ ఛార్జీలు

- February 02, 2018 , by Maagulf
ఫిబ్రవరి 22 నుంచి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు కొత్త విద్యుత్ ఛార్జీలు

కువైట్ : వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు, ఇతర సౌకర్యాలపై ఫిబ్రవరి 22 నాటికి కొత్త టారిఫ్ చట్టాన్ని అమలు చేయాలని విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. క్రొత్త చట్టాన్ని బట్టి, కొత్త సుంకం ఒక్కో కిలోవాట్ కు ఐదు ఫిల్స్ గా నిర్ణయించారు. దీని ప్రకారం1,000 గ్యాలన్ల నీటిని తోడుకోవాలంటే 1.25 కువైట్ దినార్లగా ఉంది. ఇంతలో, వ్యవసాయ వ్యవహారాల మరియు మత్స్య వనరుల కోసం పబ్లిక్ అథారిటీ జారీ చేసిన ఉత్పత్తి సర్టిఫికేట్లు సమర్పించినవారికి సుంకాలలో రాయితీ ఉంటుంది. అలాగే  పెట్రోలియం ఫర్ పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ కు సంబంధించి కిలోవాట్లకి మూడు ఫిల్స్ వసూలు చేయడమే కాక 1,000 గ్యాలన్ల నీటిని వినియోగించుకొన్నందుకు 750 ఫిల్స్ వసూలు చేయడం జరుగుతుందని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com