ప్రవాసీయులు ఇకపై ప్రతీ రెండేళ్లకు ఒకసారి తమ లైసెన్స్ను రెస్యూల్ చేసుకోవాలి
- February 02, 2018
మస్కట్ : ఒక ఊరి కరణం...మరో ఊరిలో వెట్టి గా జీవించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. బతుకుతెరువు కోసం పొట్ట చేత పట్టుకొనివెళ్ళినవారికి గంటకో గమనిక ...నిమిషానికో నిబంధన గల్ఫ్ దేశాలలో చాలా సర్వసాధారణమైపోయింది. ఒమన్ దేశం ప్రస్తుతం ఓ నిబంధనను ఏర్పరిచింది. దీని ప్రకారం ఒమన్లో డ్రైవింగ్ లైసెన్స్ కలిగివున్న ప్రవాసీయులు ప్రతీ రెండేళ్లకు ఒకసారి తమ లైసెన్స్ను రెస్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల మార్చి 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. దేశ ట్రాఫిక్ చట్టాల సవరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.గతంలో ఉన్న నిబంధన ప్రకారమైతే ప్రవాసీయులు ప్రతి 10 ఏళ్లకుమారు తమ లైసెన్స్ను ఓమారు పునరుద్ధరించుకోవాలి. పాత నిబంధనపై ప్రస్తుతం లైసెన్స్ కలిగివున్న వ్యక్తులకు ఇబ్బంది లేదని, ప్రస్తుతమున్న లైసెన్స్ గడువుకాలం ముగిసిన అనంతరం ఈ కొత్త నిబంధన వర్తిస్తుందని అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి