ప్రవాసీయులు ఇకపై ప్రతీ రెండేళ్లకు ఒకసారి తమ లైసెన్స్ను రెస్యూల్ చేసుకోవాలి
- February 02, 2018
మస్కట్ : ఒక ఊరి కరణం...మరో ఊరిలో వెట్టి గా జీవించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. బతుకుతెరువు కోసం పొట్ట చేత పట్టుకొనివెళ్ళినవారికి గంటకో గమనిక ...నిమిషానికో నిబంధన గల్ఫ్ దేశాలలో చాలా సర్వసాధారణమైపోయింది. ఒమన్ దేశం ప్రస్తుతం ఓ నిబంధనను ఏర్పరిచింది. దీని ప్రకారం ఒమన్లో డ్రైవింగ్ లైసెన్స్ కలిగివున్న ప్రవాసీయులు ప్రతీ రెండేళ్లకు ఒకసారి తమ లైసెన్స్ను రెస్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల మార్చి 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. దేశ ట్రాఫిక్ చట్టాల సవరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.గతంలో ఉన్న నిబంధన ప్రకారమైతే ప్రవాసీయులు ప్రతి 10 ఏళ్లకుమారు తమ లైసెన్స్ను ఓమారు పునరుద్ధరించుకోవాలి. పాత నిబంధనపై ప్రస్తుతం లైసెన్స్ కలిగివున్న వ్యక్తులకు ఇబ్బంది లేదని, ప్రస్తుతమున్న లైసెన్స్ గడువుకాలం ముగిసిన అనంతరం ఈ కొత్త నిబంధన వర్తిస్తుందని అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!
- సౌదీ అరేబియాలో ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ..!!
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు









