ప్రవాసీయులు ఇకపై ప్రతీ రెండేళ్లకు ఒకసారి తమ లైసెన్స్ను రెస్యూల్ చేసుకోవాలి
- February 02, 2018
మస్కట్ : ఒక ఊరి కరణం...మరో ఊరిలో వెట్టి గా జీవించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. బతుకుతెరువు కోసం పొట్ట చేత పట్టుకొనివెళ్ళినవారికి గంటకో గమనిక ...నిమిషానికో నిబంధన గల్ఫ్ దేశాలలో చాలా సర్వసాధారణమైపోయింది. ఒమన్ దేశం ప్రస్తుతం ఓ నిబంధనను ఏర్పరిచింది. దీని ప్రకారం ఒమన్లో డ్రైవింగ్ లైసెన్స్ కలిగివున్న ప్రవాసీయులు ప్రతీ రెండేళ్లకు ఒకసారి తమ లైసెన్స్ను రెస్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల మార్చి 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. దేశ ట్రాఫిక్ చట్టాల సవరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.గతంలో ఉన్న నిబంధన ప్రకారమైతే ప్రవాసీయులు ప్రతి 10 ఏళ్లకుమారు తమ లైసెన్స్ను ఓమారు పునరుద్ధరించుకోవాలి. పాత నిబంధనపై ప్రస్తుతం లైసెన్స్ కలిగివున్న వ్యక్తులకు ఇబ్బంది లేదని, ప్రస్తుతమున్న లైసెన్స్ గడువుకాలం ముగిసిన అనంతరం ఈ కొత్త నిబంధన వర్తిస్తుందని అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







