రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
- February 02, 2018
రస్ అల్ ఖైమాలో ఓ ట్యాక్సీకి జరిగిన ప్రమాదంలో ఓ ప్రయాణీకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. అల్ ఘయిల్ ప్రాంతంలోని అంతర్గత రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. రస్ అల్ ఖైమా పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ అల్ సామ్ అల్ నక్బి మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారని, ఒకరు మృతి చెందారని చెప్పారు. ప్రమాదం గురించిన సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి ట్రాఫిక్ పెట్రోల్తోపాటుగా అంబులెన్స్, పారా మెడిక్స్ మరియు రెస్క్యూ టీమ్స్ చేరుకున్నాయి. డ్రైవర్ అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రమాదానికి గురైన కారుని తొలగించి, ట్రాఫిక్ని క్రమబద్ధీకరించారు. గాయపడ్డవారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వాహనదారులు పరిమిత వేగంతో ప్రయాణించాలనీ, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!
- సౌదీ అరేబియాలో ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ..!!
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..









