రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
- February 02, 2018
రస్ అల్ ఖైమాలో ఓ ట్యాక్సీకి జరిగిన ప్రమాదంలో ఓ ప్రయాణీకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. అల్ ఘయిల్ ప్రాంతంలోని అంతర్గత రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. రస్ అల్ ఖైమా పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ అల్ సామ్ అల్ నక్బి మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారని, ఒకరు మృతి చెందారని చెప్పారు. ప్రమాదం గురించిన సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి ట్రాఫిక్ పెట్రోల్తోపాటుగా అంబులెన్స్, పారా మెడిక్స్ మరియు రెస్క్యూ టీమ్స్ చేరుకున్నాయి. డ్రైవర్ అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రమాదానికి గురైన కారుని తొలగించి, ట్రాఫిక్ని క్రమబద్ధీకరించారు. గాయపడ్డవారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వాహనదారులు పరిమిత వేగంతో ప్రయాణించాలనీ, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- కువైట్లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్







