టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఔదార్యం
- February 06, 2018
నిజామాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత తనలో ఉన్న సేవాగుణాన్ని మరోసారి చాటిచెప్పారు. సర్పంచ్ పదవిలో ఉండి ప్రమాదవశాత్తు మృతి చెందిన మోచి బాలరాజు కుటుంబానికి ఆమె అండగా నిలిచారు. పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి అన్నీ తానై ఎంపీ కవిత చూసుకుంటున్నారు. దివంగత సర్పంచ్ కుమార్తె భారతి పెళ్లికి కవిత ఆర్థిక సాయం చేసి.. పలువురికి ఆదర్శంగా నిలిచారు. నిజామాబాద్ జిల్లాలోని బినోల గ్రామ టీఆర్ఎస్ సర్పంచ్ మోచి బాలరాజు ప్రమాదవశాత్తు మురికి కాల్వలో పడి 2016, మార్చి 12న మృతి చెందాడు. నాడు.. మోచి బాలరాజు అంత్యక్రియల ఖర్చును కవిత భరించారు. దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. బాలరాజు కుమార్తె భారతికి నిజామాబాద్ జిల్లాలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఔట్ సోర్సింగ్ కింద జాబ్ ఇప్పించి.. ఆర్థికంగా ఆదుకున్నారు. ఇక భారతి వివాహం మార్చి నెలలో ఉండటంతో.. పెళ్లి ఖర్చుల కోసమని కవిత రూ.
3 లక్షల నగదును ఇచ్చారు. ఈ నగదును టీఆర్ఎస్ అధికారులు.. భారతికి ఇవాళ అందజేశారు. ఎంపీ కవితకు రుణపడి ఉంటామని భారతి, ఆమె తల్లి ఉద్వేగానికి లోనయ్యారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!
- దుబాయ్ లో బంగారం ధరలకు రెక్కలు..!!
- పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది: యూఏఈ
- కరాచీలోని అమెరికా కాన్సులేట్ పై నిరసనకారుల దాడి
- జీసీసీ, మిడిల్ ఈస్ట్ అంతటా 700 కి పైగా విమానాలు రద్దు..!!
- ఒమన్లో వరుస దాడులు
- ఖతార్ లోని ఇండస్ట్రియల్ ఏరాలో అగ్నిప్రమాదం..!!
- ప్రయాణికులు ఎమిరేట్స్ కీలక సూచనలు..!!
- బ్రేకింగ్: గల్ఫ్ దేశాల్లో రేపటి CBSE పరీక్షలు వాయిదా!









