శ్రీనగర్‌లో ఆసుపత్రిపై తీవ్రవాదుల దాడి, పోలీస్ మృతి

- February 06, 2018 , by Maagulf
శ్రీనగర్‌లో ఆసుపత్రిపై తీవ్రవాదుల దాడి, పోలీస్ మృతి

తీవ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులు శ్రీనగర్‌లోని ఒక ఆసుపత్రిపై దాడి చేశారు. ఈ దాడిలో పోలీసు సిబ్బంది ఒకరు మృతి చెందారు.

పోలీసులు ఇవాళ శ్రీనగర్‌లోని పోలీస్ స్టేషన్ నుంచి చికిత్స నిమిత్తం ఒక పాకిస్తానీ తీవ్రవాదిని ఎస్ఎమ్‌హెచ్‌ఎస్ ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు జమ్మూకాశ్మీర్ డీఐజీ గులామ్ హసన్ భట్ స్థానిక జర్నలిస్ట్ మాజిద్ జహంగీర్‌కు తెలిపారు.

ఆ సందర్భంగా తీవ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు పాకిస్తానీ తీవ్రవాదికి రక్షణగా ఉన్నవారిపై దాడి చేశారని వివరించారు.
‘అది పాకిస్తాన్ కాదు, టెర్రరిస్తాన్!’కశ్మీర్ విలీనానికి 70 ఏళ్లు.ఈ దాడిలో నావేద్ జాట్ అనే పాకిస్తాన్ తీవ్రవాది తప్పించుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. జాట్ గత ఏడాది దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో పట్టుబడ్డాడు.

దాడి నేపథ్యంలో శ్రీనగర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com