బంద్ ఎఫెక్ట్‌‌పై దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష...

- February 08, 2018 , by Maagulf
బంద్ ఎఫెక్ట్‌‌పై దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష...

రాష్ట్రంలో బంద్ ఎఫెక్ట్, తాజా పరిణామాలపై దుబాయ్ నుంచే సమీక్ష నిర్వహించారు చంద్రబాబు.శాంతిభద్రతలకు ఎక్కడా విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరసనలు జరుగుతున్న విషయం దృష్టిలో పెట్టుకోవాలని, మన సంఘీభావం కూడా ఉంటుందని, ఐతే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సీఎం కార్యాలయం అధికారులతోపాటు, పోలీసు ఉన్నతాధికారులు సమన్వయం చేసుకుంటూ ఎక్కడా పరిస్థితి అదుపు తప్పకుండా చూడాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com