బ్రేకింగ్ : టీడీపీ ఎంపీలతో సోనియా మంతనాలు

- February 08, 2018 , by Maagulf
బ్రేకింగ్ : టీడీపీ ఎంపీలతో సోనియా మంతనాలు

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో గురువారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హౌస్ లో బీజేపీ సభ్యుడు మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను పిలిచి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి వాకబు చేశారు. ఈ ఘటనలో టీడీపీ ఎంపీలు  కేశినేని నాని , తోట నర్సింహం, రామ్మోహన్ నాయుడు. ఏపీలోని పరిణామాలపై సోనియాకు వివరించినట్టు సమాచారం. ఇదిలావుంటే సమావేశాల్లో ఏపీకి ఈ పరిస్థితి తలెత్తడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపిస్తూ, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే ఎదుట ప్లకార్డులతో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com