బంగ్లాదేశ్లో హై అలర్ట్
- February 08, 2018
ఢాకా : మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత ఖలిదా జియాపై నమోదైన అవినీతి కేసులో గురువారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ప్రభుత్వం బంగ్లాదేశ్లో హై అలర్ట్ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా జియా మద్దతుదారుల్ని అదుపు చేయడానికి పోలీసుల్ని మోహరించారు. తీర్పుపై విభేదించడంతో పాటు ఆందోళనలు చేస్తారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందస్తుగా హై అలర్ట్ను ప్రకటించింది. 2001-2006లో జియా ఒక అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేశారని, ట్రస్ట్ తరపున 248,154 డాలర్లు అక్రమంగా నిధిని సేకరించారని ఆమెపై కేసు నమోదయ్యింది. ఈ ట్రస్ట్లో ఆమె కుమారుడు, మరో నలుగురు భాగస్వామ్యులుగా ఉన్నారు. దీంతో డిసెంబరులో నిర్వహించిన ఎన్నికల్లో బిఎన్పి తరపున ఆమె పోటీ చేయలేదు.
తాజా వార్తలు
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!









