బంగ్లాదేశ్‌లో హై అలర్ట్‌

- February 08, 2018 , by Maagulf
బంగ్లాదేశ్‌లో హై అలర్ట్‌

ఢాకా : మాజీ ప్రధాని, బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ నేత ఖలిదా జియాపై నమోదైన అవినీతి కేసులో గురువారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో హై అలర్ట్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా జియా మద్దతుదారుల్ని అదుపు చేయడానికి పోలీసుల్ని మోహరించారు. తీర్పుపై విభేదించడంతో పాటు ఆందోళనలు చేస్తారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందస్తుగా హై అలర్ట్‌ను ప్రకటించింది. 2001-2006లో జియా ఒక అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేశారని, ట్రస్ట్‌ తరపున 248,154 డాలర్లు అక్రమంగా నిధిని సేకరించారని ఆమెపై కేసు నమోదయ్యింది. ఈ ట్రస్ట్‌లో ఆమె కుమారుడు, మరో నలుగురు భాగస్వామ్యులుగా ఉన్నారు. దీంతో డిసెంబరులో నిర్వహించిన ఎన్నికల్లో బిఎన్‌పి తరపున ఆమె పోటీ చేయలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com