షార్జాలో 41 ఏళ్ళ భారతీయ మహిళ మృతి
- February 10, 2018
షార్జాలో ఓ మహిళ భవనం పైనుంచి పడి మృతి చెందింది. మృతురాల్ని భారతీయ మహిళగా గుర్తించారు. అల్ కాసిమియా ప్రాంతలోని ఓ భవనం 10వ అంతస్తు నుంచి 41 ఏళ్ళ మహిళ కింద పడి మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతురాల్ని పి.థామస్గా తేల్చారు. సంఘటనా స్థలంలోనే థామస్ మృతి చెందారు. రాత్రి 8 గంటల సమయంలో పోలీస్ ఆపరేషన్స్ రూమ్ ఈ సంఘటన గురించి సమాచారం అందుకుంది. వెంటనే పెట్రోల్స్, అంబులెన్స్ సంఘటనా స్థలానికి వెళ్ళాయి. ఫోరెన్సిక్, సీఐడీ, రెస్క్యూ యూనిట్, క్రైమ్ సీన్ డిపార్ట్మెంట్స్ సైతం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడ రక్తపు మడుగులో థామస్ మృతి చెంది కన్పించింది. పోలీసులు మృతదేహాన్ని ఫోరెన్సిక్ లేబరేటరీకి తరలించారు. మృతురాలి సన్నిహితులతో పోలీసులు మాట్లాడి, ఆమె మృతికి కారణాల్ని తెలుసుకునే పనిలో ఉన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా? ప్రమాదవశాత్తూ పడిపోయిందా? అనే విషయమై ఇప్పుడే ఏమీ చెప్పలేమని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







