షార్జాలో 41 ఏళ్ళ భారతీయ మహిళ మృతి
- February 10, 2018
షార్జాలో ఓ మహిళ భవనం పైనుంచి పడి మృతి చెందింది. మృతురాల్ని భారతీయ మహిళగా గుర్తించారు. అల్ కాసిమియా ప్రాంతలోని ఓ భవనం 10వ అంతస్తు నుంచి 41 ఏళ్ళ మహిళ కింద పడి మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతురాల్ని పి.థామస్గా తేల్చారు. సంఘటనా స్థలంలోనే థామస్ మృతి చెందారు. రాత్రి 8 గంటల సమయంలో పోలీస్ ఆపరేషన్స్ రూమ్ ఈ సంఘటన గురించి సమాచారం అందుకుంది. వెంటనే పెట్రోల్స్, అంబులెన్స్ సంఘటనా స్థలానికి వెళ్ళాయి. ఫోరెన్సిక్, సీఐడీ, రెస్క్యూ యూనిట్, క్రైమ్ సీన్ డిపార్ట్మెంట్స్ సైతం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడ రక్తపు మడుగులో థామస్ మృతి చెంది కన్పించింది. పోలీసులు మృతదేహాన్ని ఫోరెన్సిక్ లేబరేటరీకి తరలించారు. మృతురాలి సన్నిహితులతో పోలీసులు మాట్లాడి, ఆమె మృతికి కారణాల్ని తెలుసుకునే పనిలో ఉన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా? ప్రమాదవశాత్తూ పడిపోయిందా? అనే విషయమై ఇప్పుడే ఏమీ చెప్పలేమని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







