సమ్మర్‌ స్పెషల్‌గా 'మెహబూబా'

- February 16, 2018 , by Maagulf
సమ్మర్‌ స్పెషల్‌గా  'మెహబూబా'

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాధ్‌ దర్శకత్వంలో ఆకాష్‌పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాధ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం మెహబూబా. ఈచిత్రానికి సందీప్‌చౌతా సంగీతం అందిస్తున్నారు. 1971 ఇండియా పాకిస్థాన్‌ యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, యుఎస్‌ల్లో 800కి పైగా థియేటర్లులో విడుదలైన ఈచిత్రం టీజర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సోషల్‌ మీడియాలో ఈ టీజర్ చాలా పాపులర్‌ అయ్యింది. పూరి జగన్నాధ్‌ కెరీర్‌లోనే డిఫరెంట్‌ మూవీగా రూపొందుతున్న మెహబూబా చిత్రాన్ని సమ్మర్‌లో చాలా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆకాష్‌పూరి సరసన నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com