భారతీయ సినిమా గాన చరిత్రలో ఆశాభోస్లేకు 'యశ్చోప్రా అవార్డ్'
- February 17, 2018
భారతీయ సినిమా గాన చరిత్రలో ఆశాభోస్లే గానం ఒక శకం. జలపాత తరంగంలా ఎంతో మందిని అలరించింది ఆశా భోస్లే. దాదాపు 70 ఏళ్లుగా ఆశా సినిమాల్లో పాటలు పాడుతున్నారు. హిందీలో ఎన్నో సినిమాల్లో పాటలు పాడిన ఆశాకి లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. దాదాపు నాలుగు తరాలుగా పాడుతున్న ఆశా.. ప్లేబ్యాక్ ఇవ్వని హీరోయిన్ లేదంటే అతిశయోక్తి కాదు . ఇటీవల ఢిల్లీలోని మేడం టుస్సాడ్స్ కార్యాలయంలో ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎంతో ఘనత సాధించిన ఆశాబోస్లే తాజాగా యశ్ చోప్రా అవార్డు అందుకుంది. గత నాలుగు సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం యశ్ చోప్రా పేరుతో మెమోరియల్ అవార్డు ఇస్తూ వస్తుండగా, తొలిసారి లతా మంగేష్కర్ ఈ అవార్డు అందుకుంది. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, రేఖ, షారూఖ్ ఖాన్ అందుకున్నారు. ఈ సంవత్సరం 84 ఏళ్ళ ఆశాబోస్లే ప్రముఖ హీరోయిన్ రేఖ చేతుల మీదుగా అవార్డు అందుకుంది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి







