భారతీయ సినిమా గాన చరిత్రలో ఆశాభోస్లేకు 'యశ్చోప్రా అవార్డ్'
- February 17, 2018
భారతీయ సినిమా గాన చరిత్రలో ఆశాభోస్లే గానం ఒక శకం. జలపాత తరంగంలా ఎంతో మందిని అలరించింది ఆశా భోస్లే. దాదాపు 70 ఏళ్లుగా ఆశా సినిమాల్లో పాటలు పాడుతున్నారు. హిందీలో ఎన్నో సినిమాల్లో పాటలు పాడిన ఆశాకి లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. దాదాపు నాలుగు తరాలుగా పాడుతున్న ఆశా.. ప్లేబ్యాక్ ఇవ్వని హీరోయిన్ లేదంటే అతిశయోక్తి కాదు . ఇటీవల ఢిల్లీలోని మేడం టుస్సాడ్స్ కార్యాలయంలో ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎంతో ఘనత సాధించిన ఆశాబోస్లే తాజాగా యశ్ చోప్రా అవార్డు అందుకుంది. గత నాలుగు సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం యశ్ చోప్రా పేరుతో మెమోరియల్ అవార్డు ఇస్తూ వస్తుండగా, తొలిసారి లతా మంగేష్కర్ ఈ అవార్డు అందుకుంది. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, రేఖ, షారూఖ్ ఖాన్ అందుకున్నారు. ఈ సంవత్సరం 84 ఏళ్ళ ఆశాబోస్లే ప్రముఖ హీరోయిన్ రేఖ చేతుల మీదుగా అవార్డు అందుకుంది.
తాజా వార్తలు
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!







