భారతీయ సినిమా గాన చరిత్రలో ఆశాభోస్లేకు 'యశ్చోప్రా అవార్డ్'
- February 17, 2018
భారతీయ సినిమా గాన చరిత్రలో ఆశాభోస్లే గానం ఒక శకం. జలపాత తరంగంలా ఎంతో మందిని అలరించింది ఆశా భోస్లే. దాదాపు 70 ఏళ్లుగా ఆశా సినిమాల్లో పాటలు పాడుతున్నారు. హిందీలో ఎన్నో సినిమాల్లో పాటలు పాడిన ఆశాకి లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. దాదాపు నాలుగు తరాలుగా పాడుతున్న ఆశా.. ప్లేబ్యాక్ ఇవ్వని హీరోయిన్ లేదంటే అతిశయోక్తి కాదు . ఇటీవల ఢిల్లీలోని మేడం టుస్సాడ్స్ కార్యాలయంలో ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎంతో ఘనత సాధించిన ఆశాబోస్లే తాజాగా యశ్ చోప్రా అవార్డు అందుకుంది. గత నాలుగు సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం యశ్ చోప్రా పేరుతో మెమోరియల్ అవార్డు ఇస్తూ వస్తుండగా, తొలిసారి లతా మంగేష్కర్ ఈ అవార్డు అందుకుంది. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, రేఖ, షారూఖ్ ఖాన్ అందుకున్నారు. ఈ సంవత్సరం 84 ఏళ్ళ ఆశాబోస్లే ప్రముఖ హీరోయిన్ రేఖ చేతుల మీదుగా అవార్డు అందుకుంది.
తాజా వార్తలు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్
- ఏపీ నూతన సీఎస్గా సాయిప్రసాద్
- ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్
- మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్
- జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- రమదాన్ మొదటి వారంలో 10వేలకుపైగా తనిఖీలు..!!
- స్కూళ్లకు 3 వారాలపాటు వింటర్ సెలవులపై భిన్నభిప్రాయాలు..!!
- బహ్రెయిన్ లో బ్యాంక్ కార్డ్ ప్రాఢ్..!!
- ఖతార్ లో QR18 బిలియన్లు దాటిన ఆన్లైన్ సేల్స్..!!









