పెరూలో డబుల్ డెక్కర్ బస్సు అదుపు తప్పి ఘోరరోడ్డు ప్రమాదం 44 మంది దుర్మరణం
- February 22, 2018
లిమా(పెరూ): పెరూలోని ఒకొనా రీజియన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ డబుల్ డెక్కర్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 44 మంది దుర్మరణం చెందారు. బుధవారం అరెకిపాలోని పాన్ అమెరికన్ హైవేపై ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఓ నదిపై నిటారుగా ఎత్తైన కొండలను ఆనుకుని వెళ్లే హైవే మలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఎమెర్జెన్సీ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి తరలివెళ్లాయి. బాధితుల మృతదేహాలు కిందనే ఉన్న నదిలో కొంత దూరం మేర కొట్టుకుపోయాయనీ.. ఇప్పటి వరకు 44 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. బస్సు బయల్దేరినప్పుడు అందులో మొత్తం 45 మంది ప్రయాణిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే మార్గమధ్యంలో మరికొందరు ఎక్కినట్టు భావిస్తున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
కాగా ప్రమాదం గురించి తెలుసుకున్న పెరూ అధ్యక్షుడు పెడ్రో పాబ్లో కుజిన్స్కి... భాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ''అరెకిపాలో జరిగిన ఘోర ప్రమాదంలో తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు నా ప్రగాఢ సానుభూతి. తక్షణ సాయం అందించే విధంగా అన్నిరకాల చర్యలు తీసుకున్నాం. బాధితులకు సత్వర చికిత్స అందించే విధంగా వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించాం...'' అని ట్వీట్ చేశారు. కాగా గత నెలలో ఇదే రహదారిపై పసామాయో సమీపంలో ఓ బస్సు మరో ట్రక్కును ఢీకొట్టటంతో 52 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







