ఆ ఉల్లంఘనలకు జైలు శిక్ష లేదు
- March 07, 2018
రియాద్: వాహనాల్ని నడుపుతూ మొబైల్ ఫోన్ నడపడం, అలాగే వాహనం నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి జైలు శిక్ష ఉండదని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ స్పష్టతనిచ్చింది. ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ఇటీవలే ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో మానిటరింగ్ చర్యలు ప్రారంభించింది. మొబైల్ ఫోన్, సీటు బెల్టుకి సంబంధించి ఉల్లంఘనల్ని ఈ పద్ధతుల్లో గుర్తిస్తున్నారు. ఈ రెండు ఉల్లంఘనలకు గాను కనిష్టంగా 150 సౌదీ రియాల్స్, గరిష్టంగా 300 సౌదీ రియాల్స్ జరీమానా విధించనున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ - ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ కల్నల్ సమి అల్ షువైరిహ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. మొబైల్ ఫోన్ వినియోగిస్తూ వాహనాలు నడపడం ప్రమాదాలకు దారి తీస్తోందని ఆయన అన్నారు. సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల ప్రమాదం జరిగినా ప్రాణాలు కాపాడుకోవచ్చని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









