ఆ ఉల్లంఘనలకు జైలు శిక్ష లేదు
- March 07, 2018
రియాద్: వాహనాల్ని నడుపుతూ మొబైల్ ఫోన్ నడపడం, అలాగే వాహనం నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి జైలు శిక్ష ఉండదని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ స్పష్టతనిచ్చింది. ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ఇటీవలే ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో మానిటరింగ్ చర్యలు ప్రారంభించింది. మొబైల్ ఫోన్, సీటు బెల్టుకి సంబంధించి ఉల్లంఘనల్ని ఈ పద్ధతుల్లో గుర్తిస్తున్నారు. ఈ రెండు ఉల్లంఘనలకు గాను కనిష్టంగా 150 సౌదీ రియాల్స్, గరిష్టంగా 300 సౌదీ రియాల్స్ జరీమానా విధించనున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ - ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ కల్నల్ సమి అల్ షువైరిహ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. మొబైల్ ఫోన్ వినియోగిస్తూ వాహనాలు నడపడం ప్రమాదాలకు దారి తీస్తోందని ఆయన అన్నారు. సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల ప్రమాదం జరిగినా ప్రాణాలు కాపాడుకోవచ్చని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







