షార్జాలో కారు ప్రమాదం: వ్యక్తి మృతి

- March 09, 2018 , by Maagulf
షార్జాలో కారు ప్రమాదం: వ్యక్తి మృతి

షార్జా:షార్జాలోని షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ రోడ్డుపై తస్జీల్‌ విలేజ్‌ వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. కారు సాంకేతిక లోపంతో ఆగిపోవడంతో, రోడ్డు మధ్యలో వాహనాన్ని ఆ వ్యక్తి నిలిపివేయగా, అదే మార్గంలో వేగంగా వచ్చిన మరో వాహనం, ఆ కారుని ఢీకొంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీస్‌ పెట్రోల్స్‌ అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని అక్కడినుంచి తరలించారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ అండ్‌ పెట్రోల్స్‌ - షార్జా పోలీస్‌, వాహనదారులు తమ వాహనాల్ని రోడ్డుపై ప్రత్యేక పరిస్థితుల్లో నిలిపివేయాల్సి వచ్చినప్పుడు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. ఎమర్జన్సీ సమయాల్లో 'యీల్డ్‌' సిగ్నల్‌ వినియోగించాలని సూచిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com