ఇరాన్ ఎయిర్లైన్స్లో ఇకపై మహిళా పైలట్లు
- March 14, 2018
మొదటిసారిగా మహిళా పైలట్లను అనుమతించనున్నట్లు ఇరాన్ జాతీయ వైమానిక సంస్థ ఇరాన్ ఎయిర్ ఇటీవలనే ప్రకటించింది. ఇరాన్ వైమానిక చరిత్రలోనే తొలిసారిగా చీఫ్ ఎగ్జిక్యూటివ్గా బాధ్యతలు చేపట్టిన ఫర్జానె షరఫ్బఫి ఈ మేరకు ప్రకటన చేస్తూ, ఇకపై తమ సిబ్బందిలో మహిళా పైలట్లు వుండడం తమందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఇరాన్లో ఇప్పటికీ మహిళలు బయటకు వస్తే, చివరకు విమానాల్లో కూడా తలకు ముసుగు ధరించాల్సిందే. ఆసియా, యూరప్ల్లో పలు నగరాలకు, దేశీయంగా 25 ప్రాంతాలకు ఇరాన్ ఎయిర్ విమానాలు నడుపుతోంది. ఏడాదికి ఒకసారి ఖాళీలను భర్తీ చేయడానికి ఇరాన్ ఎయిర్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈసారి పైలట్లుగా మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కోరింది. ప్రస్తుతం ఎయిర్లైన్స్ సంస్థలో ఉన్నతస్థాయిలో ఐదుగురు మహిళలు పనిచేస్తున్నారు. సంస్థలోని మధ్య స్థాయి మేనేజర్లలో దాదాపు 16శాతం మంది మహిళలే.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!







