ఇరాన్ ఎయిర్లైన్స్లో ఇకపై మహిళా పైలట్లు
- March 14, 2018
మొదటిసారిగా మహిళా పైలట్లను అనుమతించనున్నట్లు ఇరాన్ జాతీయ వైమానిక సంస్థ ఇరాన్ ఎయిర్ ఇటీవలనే ప్రకటించింది. ఇరాన్ వైమానిక చరిత్రలోనే తొలిసారిగా చీఫ్ ఎగ్జిక్యూటివ్గా బాధ్యతలు చేపట్టిన ఫర్జానె షరఫ్బఫి ఈ మేరకు ప్రకటన చేస్తూ, ఇకపై తమ సిబ్బందిలో మహిళా పైలట్లు వుండడం తమందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఇరాన్లో ఇప్పటికీ మహిళలు బయటకు వస్తే, చివరకు విమానాల్లో కూడా తలకు ముసుగు ధరించాల్సిందే. ఆసియా, యూరప్ల్లో పలు నగరాలకు, దేశీయంగా 25 ప్రాంతాలకు ఇరాన్ ఎయిర్ విమానాలు నడుపుతోంది. ఏడాదికి ఒకసారి ఖాళీలను భర్తీ చేయడానికి ఇరాన్ ఎయిర్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈసారి పైలట్లుగా మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కోరింది. ప్రస్తుతం ఎయిర్లైన్స్ సంస్థలో ఉన్నతస్థాయిలో ఐదుగురు మహిళలు పనిచేస్తున్నారు. సంస్థలోని మధ్య స్థాయి మేనేజర్లలో దాదాపు 16శాతం మంది మహిళలే.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







