అగ్నికి ఆహుతైన కొత్త జంట
- March 14, 2018
దుబాయ్ : పంచభూతాలతో పరాచికాలు అస్సలు వద్దని పెద్దలు హెచ్చరిస్తుంటారు.. ముఖ్యంగా భూమి, ఆకాశం కన్నా నీరు... నిప్పు... గాలి.. అకస్మాత్తుగా విరుచుకుపడి అంతు చూసేస్తాయి అనడానికి ఎన్నో ఉదాహరణలు లోకంలో వున్నాయి. దుబాయిలో ఉద్యోగం చేస్తున్న ఓ యువకుని మరణం పలువురిని కలిచివేస్తుంది. చావు కోసమే భార్యతో సహా భారతేదేశానికి వచ్చినట్లైందని పలువురు వేదన చెందుతున్నారు. దుబాయిలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న తమిళనాడుకి చెందిన వివేక్ పెళ్లైన 100 రోజుల సందర్భంగా స్వదేశంలో అందరినీ చూసేందుకు దుబాయ్ నుంచి తమిళనాడులోని తమ స్వంత ఊరికే ఎంతో సంతోషంగా చేరుకున్నారు. తన ప్రాణ స్నేహితులందరితో కలిసి భార్యను వెంటబెట్టుకుని విహారయాత్రకు అడవిలోకి వెళ్లాడు వివేక్. అయితే ఆ సమయంలో అడవిలో చెలరేగిన కార్చిచ్చు ఆ నూతన జంటను సజీవంగా దహించివేసింది. .మంటలలో తీవ్రంగా గాయపడిన ఆ భార్యాభర్తలను స్థానికంగా ఉన్నఆసుపత్రికి హుటాహుటిన తరలించినప్పటకి 70 శాతం వళ్ళు కాలిపోవడంతో వారు విషాదంగా మరణించారు. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య బుధవారం ఉదయం నాటికి 11కి చేరింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









