అగ్నికి ఆహుతైన కొత్త జంట
- March 14, 2018
దుబాయ్ : పంచభూతాలతో పరాచికాలు అస్సలు వద్దని పెద్దలు హెచ్చరిస్తుంటారు.. ముఖ్యంగా భూమి, ఆకాశం కన్నా నీరు... నిప్పు... గాలి.. అకస్మాత్తుగా విరుచుకుపడి అంతు చూసేస్తాయి అనడానికి ఎన్నో ఉదాహరణలు లోకంలో వున్నాయి. దుబాయిలో ఉద్యోగం చేస్తున్న ఓ యువకుని మరణం పలువురిని కలిచివేస్తుంది. చావు కోసమే భార్యతో సహా భారతేదేశానికి వచ్చినట్లైందని పలువురు వేదన చెందుతున్నారు. దుబాయిలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న తమిళనాడుకి చెందిన వివేక్ పెళ్లైన 100 రోజుల సందర్భంగా స్వదేశంలో అందరినీ చూసేందుకు దుబాయ్ నుంచి తమిళనాడులోని తమ స్వంత ఊరికే ఎంతో సంతోషంగా చేరుకున్నారు. తన ప్రాణ స్నేహితులందరితో కలిసి భార్యను వెంటబెట్టుకుని విహారయాత్రకు అడవిలోకి వెళ్లాడు వివేక్. అయితే ఆ సమయంలో అడవిలో చెలరేగిన కార్చిచ్చు ఆ నూతన జంటను సజీవంగా దహించివేసింది. .మంటలలో తీవ్రంగా గాయపడిన ఆ భార్యాభర్తలను స్థానికంగా ఉన్నఆసుపత్రికి హుటాహుటిన తరలించినప్పటకి 70 శాతం వళ్ళు కాలిపోవడంతో వారు విషాదంగా మరణించారు. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య బుధవారం ఉదయం నాటికి 11కి చేరింది.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







