పార్కింగ్ టికెట్ టాంపరింగ్: మహిళకు జైలు
- March 14, 2018
దుబాయ్:25 ఏళ్ళ మహిళకు మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. పార్కింగ్ టిక్కెట్ టాంపరింగ్కి పాల్పడినందుకుగాను న్యాయస్థానం నిందితురాలికి శిక్ష విధించింది. జర్మనీకి చెందిన మహిళపై ఫోర్జరీ కేసు నమోదు చేసిన ప్రాసిక్యూషన్, కఠిన శిక్ష విధించాలని న్యాయస్థానానికి అభ్యర్థించింది. 2016 జూన్ 16న ట్యాంపరింగ్ ఘటన జరిగినట్లు అల్ కువైస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. కార్లను పెయిడ్ పార్క్డ్ ఏరియాలో పరీక్షిస్తుండగా, ఓ టిక్కెట్ మీద హ్యాండ్ రైటింగ్తో ట్యాంపరింగ్ జరిగినట్లు గుర్తించానని జోర్డాన్కి చెందిన 51 ఏళ్ళ ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. మే 16కి సంబంధించిన టిక్కెట్ని జూన్ 16గా నిందితురాలు మార్చారు. విచారణలో నిందితురాలు తన నేరాన్ని అంగీకరించారు. మే నెల నంబర్ 5 కాగా, దాన్ని జూన్ నెల నెంబర్ అయిన 6గా మార్చింది నిందితురాలు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









