పార్కింగ్ టికెట్ టాంపరింగ్: మహిళకు జైలు
- March 14, 2018దుబాయ్:25 ఏళ్ళ మహిళకు మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. పార్కింగ్ టిక్కెట్ టాంపరింగ్కి పాల్పడినందుకుగాను న్యాయస్థానం నిందితురాలికి శిక్ష విధించింది. జర్మనీకి చెందిన మహిళపై ఫోర్జరీ కేసు నమోదు చేసిన ప్రాసిక్యూషన్, కఠిన శిక్ష విధించాలని న్యాయస్థానానికి అభ్యర్థించింది. 2016 జూన్ 16న ట్యాంపరింగ్ ఘటన జరిగినట్లు అల్ కువైస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. కార్లను పెయిడ్ పార్క్డ్ ఏరియాలో పరీక్షిస్తుండగా, ఓ టిక్కెట్ మీద హ్యాండ్ రైటింగ్తో ట్యాంపరింగ్ జరిగినట్లు గుర్తించానని జోర్డాన్కి చెందిన 51 ఏళ్ళ ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. మే 16కి సంబంధించిన టిక్కెట్ని జూన్ 16గా నిందితురాలు మార్చారు. విచారణలో నిందితురాలు తన నేరాన్ని అంగీకరించారు. మే నెల నంబర్ 5 కాగా, దాన్ని జూన్ నెల నెంబర్ అయిన 6గా మార్చింది నిందితురాలు.
తాజా వార్తలు
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!