స్కూల్ బస్ ప్రమాదం: విద్యార్థి మృతి
- March 14, 2018
మస్కట్: అదామ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి చనిపోగా, 12 మంది గాయపడ్డారు. స్కూల్ బస్ - ట్రక్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అదామ్లోని స్కూల్లో విద్యార్థులు చదువుతున్నారు. ఉసామా బిన్ జాయెద్ స్కూల్కి చెందిన 5 నుంచి 9 అలాగే 10, 12 గ్రేడ్స్కి చెందిన విద్యార్థులతో బస్ వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు స్కూల్ యాజమాన్యం పేర్కొంది. విలాయత్ ఆఫ్ అదామ్లో రోడ్డు ప్రమాదం జరగగా, గాయాలపాలైనవారిని నిజ్వా ఆసుపత్రికి తరలించారు. తమ ఆసుపత్రికి 9 మందిని తీసుకొచ్చారనీ, వీరిలో 1కరు గ్రీన్ కేస్ కాగా, 6 ఎల్లో కేస్లు, 1 రెడ్ మరియు 1 బ్లాక్ కేస్ నమోదయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం కారణంగా కాలిన గాయాలవడంతో ఆ కేసుని రెడ్ కేస్గా పరిగణించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిస్థితిని సమీక్షిస్తోంది. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి మినీస్ట్రీ సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







