స్కూల్ బస్ ప్రమాదం: విద్యార్థి మృతి
- March 14, 2018మస్కట్: అదామ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి చనిపోగా, 12 మంది గాయపడ్డారు. స్కూల్ బస్ - ట్రక్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అదామ్లోని స్కూల్లో విద్యార్థులు చదువుతున్నారు. ఉసామా బిన్ జాయెద్ స్కూల్కి చెందిన 5 నుంచి 9 అలాగే 10, 12 గ్రేడ్స్కి చెందిన విద్యార్థులతో బస్ వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు స్కూల్ యాజమాన్యం పేర్కొంది. విలాయత్ ఆఫ్ అదామ్లో రోడ్డు ప్రమాదం జరగగా, గాయాలపాలైనవారిని నిజ్వా ఆసుపత్రికి తరలించారు. తమ ఆసుపత్రికి 9 మందిని తీసుకొచ్చారనీ, వీరిలో 1కరు గ్రీన్ కేస్ కాగా, 6 ఎల్లో కేస్లు, 1 రెడ్ మరియు 1 బ్లాక్ కేస్ నమోదయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం కారణంగా కాలిన గాయాలవడంతో ఆ కేసుని రెడ్ కేస్గా పరిగణించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిస్థితిని సమీక్షిస్తోంది. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి మినీస్ట్రీ సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం