స్కూల్‌ బస్‌ ప్రమాదం: విద్యార్థి మృతి

- March 14, 2018 , by Maagulf
స్కూల్‌ బస్‌ ప్రమాదం: విద్యార్థి మృతి
మస్కట్‌: అదామ్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి చనిపోగా, 12 మంది గాయపడ్డారు. స్కూల్‌ బస్‌ - ట్రక్‌ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అదామ్‌లోని స్కూల్‌లో విద్యార్థులు చదువుతున్నారు. ఉసామా బిన్‌ జాయెద్‌ స్కూల్‌కి చెందిన 5 నుంచి 9 అలాగే 10, 12 గ్రేడ్స్‌కి చెందిన విద్యార్థులతో బస్‌ వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు స్కూల్‌ యాజమాన్యం పేర్కొంది. విలాయత్‌ ఆఫ్‌ అదామ్‌లో రోడ్డు ప్రమాదం జరగగా, గాయాలపాలైనవారిని నిజ్వా ఆసుపత్రికి తరలించారు. తమ ఆసుపత్రికి 9 మందిని తీసుకొచ్చారనీ, వీరిలో 1కరు గ్రీన్‌ కేస్‌ కాగా, 6 ఎల్లో కేస్‌లు, 1 రెడ్‌ మరియు 1 బ్లాక్‌ కేస్‌ నమోదయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం కారణంగా కాలిన గాయాలవడంతో ఆ కేసుని రెడ్‌ కేస్‌గా పరిగణించారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ పరిస్థితిని సమీక్షిస్తోంది. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి మినీస్ట్రీ సంతాపం తెలిపింది. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com