కేరళ ప్రమాదంలో యూఏఈకి చెందిన కుటుంబం మృతి

- March 17, 2018 , by Maagulf
కేరళ ప్రమాదంలో యూఏఈకి చెందిన కుటుంబం మృతి

యూఏఈకి చెందిన ఇండియన్‌ మ్యాన్‌, అతని కుటుంబంతో కలిసి వెకేషన్‌కి స్వదేశంలోని కేరళకు వెళ్ళి, ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 40 ఏళ్ళ కొలండైతువీటిల్‌ షిబు, 34 ఏళ్ళ అతని భార్య సిజి, 11 ఏళ్ళ వారి కుమారుడు కొల్లామ్‌లోని ఛతనూర్‌ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 7 ఏళ్ళ చిన్నారి ఆదిష్‌ ఈ ప్రమాదంలో గాయాలతో బయటపడ్డాడు. మధ్యాహ్నం 2.30 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నలుగురూ బైక్‌ మీద వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు మృతుల ఫ్యామిలీ ప్రెండ్‌ షిజిన్‌ చెప్పారు. షిబు, రస్‌ అల్‌ ఖైమాలోని అల్‌ జజీరా పోర్ట్‌ ఉద్యోగి. సిజ్జి, ఆమె ఇద్దరు కుమారులు కేరళలో నివసిస్తున్నారు. సిబు, తన కుటుంబాన్ని కలిసేందుకు కేరళ వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com