కేరళ ప్రమాదంలో యూఏఈకి చెందిన కుటుంబం మృతి
- March 17, 2018
యూఏఈకి చెందిన ఇండియన్ మ్యాన్, అతని కుటుంబంతో కలిసి వెకేషన్కి స్వదేశంలోని కేరళకు వెళ్ళి, ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 40 ఏళ్ళ కొలండైతువీటిల్ షిబు, 34 ఏళ్ళ అతని భార్య సిజి, 11 ఏళ్ళ వారి కుమారుడు కొల్లామ్లోని ఛతనూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 7 ఏళ్ళ చిన్నారి ఆదిష్ ఈ ప్రమాదంలో గాయాలతో బయటపడ్డాడు. మధ్యాహ్నం 2.30 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నలుగురూ బైక్ మీద వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు మృతుల ఫ్యామిలీ ప్రెండ్ షిజిన్ చెప్పారు. షిబు, రస్ అల్ ఖైమాలోని అల్ జజీరా పోర్ట్ ఉద్యోగి. సిజ్జి, ఆమె ఇద్దరు కుమారులు కేరళలో నివసిస్తున్నారు. సిబు, తన కుటుంబాన్ని కలిసేందుకు కేరళ వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?









