'టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ రీడర్స్' లో మోదీ టాప్-10
- December 01, 2015బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఓటమి ప్రధాని నరేంద్ర మోదీని నిరాశపరిచినా అంతర్జాతీయ స్థాయిలో మాత్రం ఆయన హవా కొనసాగుతోంది. 'టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ రీడర్స్' చాయిస్ పోల్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం టాప్-10లో నిలిచారు. సోమవారం సాయంత్రానికి మోదీ 2.7 శాతం ఓట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచారు. భారత్ లో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని ఆధునీకరించేందుకు మోదీ ప్రయత్నించడం వంటి అంశాలను టైమ్ ప్రొఫైల్ లో పేర్కొంది. టాప్-10లో మోదీతో పాటు పాకిస్తాన్ ధీర బాలిక, నోబుల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్, పోప్ ఫ్రాన్సిస్ ఉన్నారు. ఈ పోల్ లో అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి బెర్నీ శాండర్స్ (10.5 శాతం) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. శాండర్స్ కు తన పోటీదారులు డొనాల్డ్ ట్రంప్ (రిపబ్లికన్-2.1 శాతం), హిల్లరీ క్లింటన్ (డెమొక్రటిక్-1.4 శాతం)ల కంటే ఎక్కువ మద్దతు లభించింది. ఇక మలాలా (5.9 శాతం), పోప్ ఫ్రాన్సిస్ (3.9 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నాలుగు, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ పది స్థానాల్లో ఉన్నారు. ఇక భారత సంతతికి చెందిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ 1.5 శాతం ఓట్లతో 25వ స్థానంలో నిలిచారు. చాయిస్ పోల్ ఓటింగ్ ఈ నెల 4వ తేదీతో ముగియనుంది. విజేతను 7న ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







