ఫేక్ పేపర్స్తో అద్దెకు కారు: ఇద్దరిపై కేసు
- March 23, 2018
దుబాయ్:అద్దెకు కారు తీసుకుని, తిరిగి ఆ కారుని ఇవ్వనందుకుగాను, అలాగే రెంటల్ ఫీజ్ చెల్లించనందుకుగాను వారిపై కేసులు నమోదయ్యాయి. పాకిస్తాన్కి చెందిన ఇద్దరు వ్యక్తులు ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా అల్ రషిదియాలోని ఓ ఆఫీసు ద్వారా కార్లను అద్దెకి తీసుకున్నారు. అయితే అద్దె చెల్లించడంలో ఇద్దరూ తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరిగింది. అయితే నిందితులు, నేరాన్ని తొలుత అంగీకరించలేదు. ఫోర్జరీ డాక్యుమెంట్లకు సంబంధించిన ఆరోపణల్నీ నిందితులు ఒప్పుకోవడంలేదు. ఎమిరేటీ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అన్నీ ఫేక్ అని విచారణలో తేలింది. బాధితుడు, తనకు నిందితులు ఇచ్చిన డాక్యుమెంట్ల ప్రకారం సదరు వ్యక్తిని సంప్రదిస్తే, ఆ వ్యక్తి ఆ డాక్యుమెంట్లతో తనకు సంబంధం లేదని చెప్పారనీ న్యాయస్థానం యెదుట వాపోయాడు. ఈ కేసులో మార్చి 26న తీర్పు వెలువడనుంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









