ఫేక్ పేపర్స్తో అద్దెకు కారు: ఇద్దరిపై కేసు
- March 23, 2018
దుబాయ్:అద్దెకు కారు తీసుకుని, తిరిగి ఆ కారుని ఇవ్వనందుకుగాను, అలాగే రెంటల్ ఫీజ్ చెల్లించనందుకుగాను వారిపై కేసులు నమోదయ్యాయి. పాకిస్తాన్కి చెందిన ఇద్దరు వ్యక్తులు ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా అల్ రషిదియాలోని ఓ ఆఫీసు ద్వారా కార్లను అద్దెకి తీసుకున్నారు. అయితే అద్దె చెల్లించడంలో ఇద్దరూ తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరిగింది. అయితే నిందితులు, నేరాన్ని తొలుత అంగీకరించలేదు. ఫోర్జరీ డాక్యుమెంట్లకు సంబంధించిన ఆరోపణల్నీ నిందితులు ఒప్పుకోవడంలేదు. ఎమిరేటీ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అన్నీ ఫేక్ అని విచారణలో తేలింది. బాధితుడు, తనకు నిందితులు ఇచ్చిన డాక్యుమెంట్ల ప్రకారం సదరు వ్యక్తిని సంప్రదిస్తే, ఆ వ్యక్తి ఆ డాక్యుమెంట్లతో తనకు సంబంధం లేదని చెప్పారనీ న్యాయస్థానం యెదుట వాపోయాడు. ఈ కేసులో మార్చి 26న తీర్పు వెలువడనుంది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









