జమ్మూ కాశ్మీర్ లో 8 మంది ఉగ్రవాదుల హతం.!
- April 01, 2018
వరుసగా జరిగిన ఎన్ కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతం కాగా ఇద్దరు భారత జవాన్లకు గాయాలయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. షోపియాన్ జిల్లాలో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న భారత బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీనితో భారత సైన్యం ధీటుగా స్పందించింది. ఎదురు కాల్పులు జరపడంతో ఏడుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. అనంతనాగ్ జిల్లాలోని ఓ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆయా ఘటనా ప్రదేశాల నుండి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రీ, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే షోపియాన్ లోని కచ్ దూర్ లో స్థానికులను బందీలుగా చేసుకుని ఉగ్రవాదులు నక్కినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







