'భరత్' ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు కానున్న తారక్, చరణ్.!
- April 01, 2018
ప్రీ రిలీజ్ వేడుకలకు, ఆడియో విడుదల కార్యక్రమాలకు సెలబ్రిటీలు హాజరుకావడం ఇటీవల సర్వసాధారణమైంది. 'ఆనందోబ్రహ్మ' సినిమాకు ప్రభాస్, 'బాలకృష్ణుడు' ఆడియో లాంచ్కు సమంత, ఇటీవల 'ఛలో' వేడుకకు చిరంజీవి హాజరై సందడి చేశారు.
ఇప్పుడు 'భరత్' కోసం ఎన్టీఆర్, రామ్చరణ్ అతిథులుగా రాబోతున్నారట. మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న 'భరత్ అనే నేను' ప్రీ రిలీజ్ వేడుక ఏప్రిల్7న జరగబోతోంది. ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారంతా ఎల్బీ స్టేడియంలోనే ప్రమాణ స్వీకారాలు చేశారట.
ఈ సినిమాలో మహేశ్ ఏపీ ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు కాబట్టి ఎల్బీ స్టేడియంలోనే ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించాలని చిత్రబృందం భావించిందట. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న దానయ్య ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్, రామ్చరణ్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తారక్, చరణ్తో ఓ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు. అందుకే 'భరత్' వేడుకకు వారిని రావాల్సిందిగా కోరారట. ఇందుకు వారూ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







