'భరత్' ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు కానున్న తారక్, చరణ్.!
- April 01, 2018
ప్రీ రిలీజ్ వేడుకలకు, ఆడియో విడుదల కార్యక్రమాలకు సెలబ్రిటీలు హాజరుకావడం ఇటీవల సర్వసాధారణమైంది. 'ఆనందోబ్రహ్మ' సినిమాకు ప్రభాస్, 'బాలకృష్ణుడు' ఆడియో లాంచ్కు సమంత, ఇటీవల 'ఛలో' వేడుకకు చిరంజీవి హాజరై సందడి చేశారు.
ఇప్పుడు 'భరత్' కోసం ఎన్టీఆర్, రామ్చరణ్ అతిథులుగా రాబోతున్నారట. మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న 'భరత్ అనే నేను' ప్రీ రిలీజ్ వేడుక ఏప్రిల్7న జరగబోతోంది. ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారంతా ఎల్బీ స్టేడియంలోనే ప్రమాణ స్వీకారాలు చేశారట.
ఈ సినిమాలో మహేశ్ ఏపీ ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు కాబట్టి ఎల్బీ స్టేడియంలోనే ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించాలని చిత్రబృందం భావించిందట. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న దానయ్య ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్, రామ్చరణ్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తారక్, చరణ్తో ఓ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు. అందుకే 'భరత్' వేడుకకు వారిని రావాల్సిందిగా కోరారట. ఇందుకు వారూ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్









