స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా శ్రీకాంత్, సింధు
- April 02, 2018
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ తాజాగా స్పోర్ట్స్ పర్సన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను దక్కించుకున్నారు. బెస్ట్ కోచ్ అవార్డును పుల్లెల గోపీచంద్ కైవసం చేసుకున్నారు. ఈఎస్పీఎన్ తొలిసారిగా పలు విభాగాల్లో క్రీడాకారులకు అవార్డులు ప్రకటించింది. 11 విభాగాలకు చెందిన క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా ఈ అవార్డులను ప్రకటించారు. అభినవ్ బింద్రా, సోమ్దేవ్, బైచుంగ్ భూటియా, జగ్బీర్ సింగ్, రోహిత్ బ్రిజ్నాథ్, వెంకటేశన్ దేవరాజన్, నిషా మిల్లట్, అపర్ణ పొపట్, జగదీశ్, మనీషా, అంజుబాబీ జార్జ్తో కూడిన జ్యూరీ బృందం విజేతలను ప్రకటించింది. గత ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు సొంతం చేసుకున్న కిదాంబి శ్రీకాంత్కు పురుషుల విభాగంలో స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఎంపిక చేశారు. ఇక మహిళల విభాగంలో పీవీ సింధుకు ఈ అవార్డు దక్కింది. ఇక కోచ్ విషయానికి వస్తే పుల్లెల గోపీచంద్ బెస్ట్ కోచ్ అవార్డును కైవసం చేసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







