ఇసుకలో కూరుకుపోయి ఇద్దరు కార్మికుల మృతి
- April 02, 2018
ఆసియాకి చెందిన ఇద్దరు కూలీలు, ఓ బావిని తవ్వుతున్న క్రమంలో ఇసుకలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. రస్ అల్ ఖైమాలోని రెసిడెన్షియల్ జోన్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇసుకలో కూరుకుపోయిన ఇద్దరి మృతదేహాల్ని రస్ అల్ ఖైమా పోలీస్ మరియు సివిల్ డిఫెన్స్ శ్రమించి బయటకు తీయడం జరిగింది. ఉదయం 10.30 నిమిషాల సమయంలో ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే, సంఘటనా స్థలానికి రెస్క్యూ మరియు సెర్చ్ టీమ్స్ బయల్దేరాయనీ, 20 మీటర్ల లోతున కూరుకుపోయిన మృతదేహాల్ని బయటకు తీశామని అల్ మమౌరా పోలీస్ స్టేషన్ యాక్టింగ్ డైరెక్టర్ కెప్టెన& మొహమ్మద్ అలి అల్ నౌమి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోంది. ఇలాంటి పనులు చేపట్టేముందు తగిన అనుమతులు పొందాలని రస్ అల్ ఖైమా పోలీస్ సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ ఘానెమ్ అహ్మద్ ఘానెమ్ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







