ఇసుకలో కూరుకుపోయి ఇద్దరు కార్మికుల మృతి
- April 02, 2018
ఆసియాకి చెందిన ఇద్దరు కూలీలు, ఓ బావిని తవ్వుతున్న క్రమంలో ఇసుకలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. రస్ అల్ ఖైమాలోని రెసిడెన్షియల్ జోన్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇసుకలో కూరుకుపోయిన ఇద్దరి మృతదేహాల్ని రస్ అల్ ఖైమా పోలీస్ మరియు సివిల్ డిఫెన్స్ శ్రమించి బయటకు తీయడం జరిగింది. ఉదయం 10.30 నిమిషాల సమయంలో ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే, సంఘటనా స్థలానికి రెస్క్యూ మరియు సెర్చ్ టీమ్స్ బయల్దేరాయనీ, 20 మీటర్ల లోతున కూరుకుపోయిన మృతదేహాల్ని బయటకు తీశామని అల్ మమౌరా పోలీస్ స్టేషన్ యాక్టింగ్ డైరెక్టర్ కెప్టెన& మొహమ్మద్ అలి అల్ నౌమి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోంది. ఇలాంటి పనులు చేపట్టేముందు తగిన అనుమతులు పొందాలని రస్ అల్ ఖైమా పోలీస్ సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ ఘానెమ్ అహ్మద్ ఘానెమ్ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!