ఇసుకలో కూరుకుపోయి ఇద్దరు కార్మికుల మృతి
- April 02, 2018
ఆసియాకి చెందిన ఇద్దరు కూలీలు, ఓ బావిని తవ్వుతున్న క్రమంలో ఇసుకలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. రస్ అల్ ఖైమాలోని రెసిడెన్షియల్ జోన్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇసుకలో కూరుకుపోయిన ఇద్దరి మృతదేహాల్ని రస్ అల్ ఖైమా పోలీస్ మరియు సివిల్ డిఫెన్స్ శ్రమించి బయటకు తీయడం జరిగింది. ఉదయం 10.30 నిమిషాల సమయంలో ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే, సంఘటనా స్థలానికి రెస్క్యూ మరియు సెర్చ్ టీమ్స్ బయల్దేరాయనీ, 20 మీటర్ల లోతున కూరుకుపోయిన మృతదేహాల్ని బయటకు తీశామని అల్ మమౌరా పోలీస్ స్టేషన్ యాక్టింగ్ డైరెక్టర్ కెప్టెన& మొహమ్మద్ అలి అల్ నౌమి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోంది. ఇలాంటి పనులు చేపట్టేముందు తగిన అనుమతులు పొందాలని రస్ అల్ ఖైమా పోలీస్ సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ ఘానెమ్ అహ్మద్ ఘానెమ్ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









