ఇసుకలో కూరుకుపోయి ఇద్దరు కార్మికుల మృతి

- April 02, 2018 , by Maagulf
ఇసుకలో కూరుకుపోయి ఇద్దరు కార్మికుల మృతి

ఆసియాకి చెందిన ఇద్దరు కూలీలు, ఓ బావిని తవ్వుతున్న క్రమంలో ఇసుకలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. రస్‌ అల్‌ ఖైమాలోని రెసిడెన్షియల్‌ జోన్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇసుకలో కూరుకుపోయిన ఇద్దరి మృతదేహాల్ని రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌ మరియు సివిల్‌ డిఫెన్స్‌ శ్రమించి బయటకు తీయడం జరిగింది. ఉదయం 10.30 నిమిషాల సమయంలో ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే, సంఘటనా స్థలానికి రెస్క్యూ మరియు సెర్చ్‌ టీమ్స్‌ బయల్దేరాయనీ, 20 మీటర్ల లోతున కూరుకుపోయిన మృతదేహాల్ని బయటకు తీశామని అల్‌ మమౌరా పోలీస్‌ స్టేషన్‌ యాక్టింగ్‌ డైరెక్టర్‌ కెప్టెన& మొహమ్మద్‌ అలి అల్‌ నౌమి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోంది. ఇలాంటి పనులు చేపట్టేముందు తగిన అనుమతులు పొందాలని రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌ సెంట్రల్‌ ఆపరేషన్స్‌ రూమ్‌ డైరెక్టర్‌ జనరల్‌ బ్రిగేడియర్‌ ఘానెమ్‌ అహ్మద్‌ ఘానెమ్‌ విజ్ఞప్తి చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com