వాట్సాప్లో ఫేక్ మెసేజ్: 1 మిలియన్ దిర్హామ్ వరకు జరీమానా
- April 02, 2018
వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫేక్ మెసేజ్లను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని అబుదాబీ పోలీస్ హెచ్చరించడం జరిగింది. సమాచారాన్ని దొంగిలించడం, దొంగిలించిన సమాచారాన్ని బహిర్గతం చేయడం, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల్ని 'అనుమతి లేకుండా' బహిర్గతం చేయడం వంటివి తీవ్రమైన నేరాలుగా పరిగణింపబడ్తాయనీ, ఇవన్నీ ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయిన దరిమిలా, కఠినమైన చట్టాలు అలాంటి క్రిమినల్ చర్యలకు అడ్డుకట్ట వేస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. ఫేక్ జాబ్స్, ఫేక్ హెల్త్ టిప్స్ వంటివి ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నాయని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి నేరాలకు సైబర్ క్రైమ్ లా ప్రకారం కఠిన చర్యలుంటాయని చెబుతూ, ఇలాంటి నేరాలకు పాల్పడితే ఏడాది నుంచి మూడేళ్ళ జైలు శిక్షతోపాటుగా 250,000 నుంచి 1 మిలియన్ దిర్హామ్ వరకు జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. నాన్ ఎలక్ట్రానిక్ ఫ్రాడ్ అయితే ఒకటి నుంచి మూడు నెలల వరకు జైలు శిక్ష, 1000 నుంచి 30,000 దిర్హామ్ల జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!