ఇరాక్ మృతులకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
- April 03, 2018
న్యూఢిల్లీ: ఇరాక్లో ఐఎస్ ఉగ్రమూకల చేతుల్లో ఊచకోతకు గురైన భారతీయుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. రూ.10 లక్షల చొప్పున మొత్తం 39 మంది మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రకటించారు. ఇరాక్లో మృతి చెందిన భారత కార్మికులకు పరిహారం చెల్లించాలంటూ పంజాబ్కి చెందిన కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో నిరసన తెలిపిన అనంతరం ప్రధాని ఈ ప్రకటన చేశారు.
ఇరాక్లోని మోసుల్ సమీపంలో ఐఎస్ ఉగ్రవాదుల చేతిలో బలైన మొత్తం 39 మందిలో... 38 మంది మృతుల అవశేషాలను నిన్న భారత్ తరలించిన సంగతి తెలిసిందే. కేంద్ర విదేశాంగ సహాయమంత్రి వీకే సింగ్ ప్రత్యేక విమానంలో ఇరాక్ వెళ్లి మృతదేహాలను తీసుకొచ్చారు. మృతుల్లో అత్యధికంగా 27 మంది పంజాబ్కు చెందినవారే కావడంతో... వీకే స్వయంగా అమృత్సర్ వెళ్లి మృతదేహాలను అప్పగించారు. కాగా 2014లో ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన 39 మంది భారతీయులు మరణించినట్టు గత నెలలో కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









