ఇరాక్ మృతులకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
- April 03, 2018
న్యూఢిల్లీ: ఇరాక్లో ఐఎస్ ఉగ్రమూకల చేతుల్లో ఊచకోతకు గురైన భారతీయుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. రూ.10 లక్షల చొప్పున మొత్తం 39 మంది మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రకటించారు. ఇరాక్లో మృతి చెందిన భారత కార్మికులకు పరిహారం చెల్లించాలంటూ పంజాబ్కి చెందిన కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో నిరసన తెలిపిన అనంతరం ప్రధాని ఈ ప్రకటన చేశారు.
ఇరాక్లోని మోసుల్ సమీపంలో ఐఎస్ ఉగ్రవాదుల చేతిలో బలైన మొత్తం 39 మందిలో... 38 మంది మృతుల అవశేషాలను నిన్న భారత్ తరలించిన సంగతి తెలిసిందే. కేంద్ర విదేశాంగ సహాయమంత్రి వీకే సింగ్ ప్రత్యేక విమానంలో ఇరాక్ వెళ్లి మృతదేహాలను తీసుకొచ్చారు. మృతుల్లో అత్యధికంగా 27 మంది పంజాబ్కు చెందినవారే కావడంతో... వీకే స్వయంగా అమృత్సర్ వెళ్లి మృతదేహాలను అప్పగించారు. కాగా 2014లో ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన 39 మంది భారతీయులు మరణించినట్టు గత నెలలో కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







