ముంబై లో 'బయోటాయిలెట్స్' నిర్మాణం

- April 03, 2018 , by Maagulf
ముంబై లో 'బయోటాయిలెట్స్' నిర్మాణం

గతేడాది అక్షయ్‌కుమార్, భూమి పెండ్నేకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా'. మరుగుదొడ్డి ప్రాధాన్యతను తెలియజేసే సామాజిక సందేశంతో వచ్చింది. అయితే మురికివాడల్లో ఉండి మరుగుదొడ్డి సౌకర్యం లేనివారు ముంబైలోని జుహు బీచ్‌లో బహిరంగ మలవిసర్జన చేస్తుండటాన్ని సోషల్‌మీడియా ద్వారా అందరికీ తెలిపింది అక్షయ్ వైఫ్ ట్వింఖిల్ ఖన్నా. ఈ నేపథ్యంలో అక్షయ్‌కుమార్ స్వయంగా బయోటాయిలెట్స్ ఏర్పాటు చేసి ఔదార్యాన్ని చాటుకున్నాడు. శివసేన నేత ఆదిత్యా థాకరే సాయంతో అక్షయ్‌కుమార్ రూ.10 లక్షలు ఖర్చు చేసి ఆధునిక బయో టాయిలెట్స్ ఏర్పాటు చేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com