పిలుపొస్తే తప్పకుండా చేస్తా - జూ.ఎన్టీఆర్
- April 04, 2018
నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ల మధ్య దూరం అందరికి తెలిసిందే. కారణం ఇది అని ఎవరు చెప్పకున్నా సరే వారి మధ్య దూరం దూరంగానే ఉంది. మధ్యలో సంధి కుదిర్చే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. అయితే ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా ఓపెనింగ్ కు అందరిని పిలిచి జూనియర్ ను లైట్ తీసుకున్నాడు బాలయ్య బాబు.
ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్.టి.ఆర్ త్రివిక్రం తో సినిమాకు రెడీ అవుతుండగా ఈమధ్యలోనే ఐపిఎల్ యాడ్ చేశాడు. దాని కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ పై స్పందించాడు ఎన్.టి.ఆర్. అక్కడ నుండి పిలుపొస్తే తప్పకుండా చేస్తా అన్నాడు. కాని ఆ పిలుపు వస్తుందన్న నమ్మకం లేదు.
ఎందుకంటే సినిమా ఓపెనింగ్ కే ఆహ్వానించడం ఇష్టం లేని బాలకృష్ణ సినిమాలో ఎలా అవకాశం ఇస్తాడు. బాలకృష్ణ ఎన్.టి.ఆర్ మీద చూపిస్తున్న ఈ వివక్ష నందమూరి ఫ్యాన్స్ కు కాస్త ఇబ్బందిగా అనిపిస్తున్నా ప్రస్తుతానికి సరే అని సర్ధుకుంటున్నారు. అయితే ఎన్.టి.ఆర్ మాత్రం తెలివిగా బాల్ అవతల కోర్ట్ లోకి వేసేశాడు.
ఇక మీదట కూడా ఎన్.టి.ఆర్ బయోపిక్ గురించి తన దగ్గర ప్రస్థావించకుండా సమాధానం ఇచ్చాడు తారక్. మరి ఈ దూరం దగ్గర అయ్యే పరిస్థితులు కబడకున్నా అభిమానుల కోసం అయినా వీరు కలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో ఏమో చూడాలి.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









