కామన్వెల్త్ గేమ్స్లో ఖాతా తెరిచిన భారత్
- April 04, 2018
21వ కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో నిన్న ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కామన్వెల్త్ గేమ్స్ లో ఖాతా తెరిచింది భారత్. వెయిట్లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో గురురాజా రజత పతకం సాధించాడు. మొత్తం మూడు రౌండ్లలో 249 కిలోల బరువును ఎత్తిన గురురాజా రెండో స్థానంలో నిలిచాడు. 261 కిలోల బరువును ఎత్తిన మలేసియా వెయిట్ లిప్టర్ మహ్మద్ ఇజార్ అహ్మద్. గోల్డ్ మెడల్ సాధిస్తే. 249 కిలోల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచిన గురురాజాకు సిల్వర్ మెడల్ దక్కింది. శ్రీలంక లిఫ్టర్ లక్మల్ 248 కేజీల బరువును ఎత్తేసి కాంస్య పతకాన్ని అందుకున్నాడు. భారత్కు 56 కేజీల విభాగంలో ఇదే ఫస్ట్ మెడల్ కావడం విశేషం.
గ్లాస్గోలో జరిగిన గత కామన్వెల్త్ క్రీడల్లో భారత జట్టు 15 స్వర్ణాలు, 30 రజతాలు, 18 కాంస్యాలతో పతకాల పట్టికలో ఐదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక గోల్డ్కోస్ట్లో జరుగుతున్న 21వ కామన్వెల్త్ గేమ్స్ 12 రోజుల పాటు క్రీడాభిమానులను ఉర్రూతలూగించనుండగా. కామన్వెల్త్ గేమ్స్లో మొత్తం 6600 మంది అథ్లెట్లు పతకాల కోసం పోటీపడుతున్నారు. ఈ సారి మరిన్ని పతకాలు సాధించి భారత్. ప తకాల పట్టికలో మరింత ముందుకు సాగాలని కోరుకుందాం.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







