అమ్నెస్టీ రిపోర్ట్ని తిరస్కరించిన ఖతార్
- December 02, 2015
ఖతార్ ప్రభుత్వం అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇచ్చిన నివేదికను తిరస్కరించింది. ఖతార్లో వలస కార్మికులు నిరాదరణకు గురవుతున్నారనీ, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన నివేదికలో పేర్కొనడాన్ని ఖతార్ ప్రభుత్వం తప్పు పట్టింది. ఖతార్లో వలస కార్మికుల కోసం అనేక చర్యలు చేపడుతున్నామనీ, దేశ అభివృద్ధిలో వలస కార్మికుల పాత్ర ఎనలేనిదని ఖతార్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వలస కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో నిత్యం తనిఖీలు జరుగుతుంటాయన్న ప్రభుత్వం, ఎక్కడా ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఉపేక్షించడంలేదనీ, సమస్యల పట్ల తీవ్రంగా స్పందిస్తున్నామని పేర్కొంది. కార్మికుల్ని ప్రొటెక్ట్ చేసేందుకు ఖతార్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ, జాతి నిర్మాణంలో కార్మికులు కీలక భూమిక పోషిస్తున్నారని స్పష్టంగా చెప్పింది. దేశ కీర్తి ప్రతిష్టలు దెబ్బతినేలా ఆమ్నెస్టీ రిపోర్ట్ ఉందని ఆక్షేపణ వ్యక్తం చేస్తూ, వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ద్వారా కార్మికులు తగిన సమయంలో జీతాలు పొందుతున్నారని, అలాగే వారంతా సంతోషంగా తమ పనులు చేసుకుంటున్నారని చెప్పింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







