అమ్నెస్టీ రిపోర్ట్ని తిరస్కరించిన ఖతార్
- December 02, 2015
ఖతార్ ప్రభుత్వం అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇచ్చిన నివేదికను తిరస్కరించింది. ఖతార్లో వలస కార్మికులు నిరాదరణకు గురవుతున్నారనీ, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన నివేదికలో పేర్కొనడాన్ని ఖతార్ ప్రభుత్వం తప్పు పట్టింది. ఖతార్లో వలస కార్మికుల కోసం అనేక చర్యలు చేపడుతున్నామనీ, దేశ అభివృద్ధిలో వలస కార్మికుల పాత్ర ఎనలేనిదని ఖతార్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వలస కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో నిత్యం తనిఖీలు జరుగుతుంటాయన్న ప్రభుత్వం, ఎక్కడా ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఉపేక్షించడంలేదనీ, సమస్యల పట్ల తీవ్రంగా స్పందిస్తున్నామని పేర్కొంది. కార్మికుల్ని ప్రొటెక్ట్ చేసేందుకు ఖతార్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ, జాతి నిర్మాణంలో కార్మికులు కీలక భూమిక పోషిస్తున్నారని స్పష్టంగా చెప్పింది. దేశ కీర్తి ప్రతిష్టలు దెబ్బతినేలా ఆమ్నెస్టీ రిపోర్ట్ ఉందని ఆక్షేపణ వ్యక్తం చేస్తూ, వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ద్వారా కార్మికులు తగిన సమయంలో జీతాలు పొందుతున్నారని, అలాగే వారంతా సంతోషంగా తమ పనులు చేసుకుంటున్నారని చెప్పింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







