అమ్నెస్టీ రిపోర్ట్ని తిరస్కరించిన ఖతార్
- December 02, 2015
ఖతార్ ప్రభుత్వం అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇచ్చిన నివేదికను తిరస్కరించింది. ఖతార్లో వలస కార్మికులు నిరాదరణకు గురవుతున్నారనీ, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన నివేదికలో పేర్కొనడాన్ని ఖతార్ ప్రభుత్వం తప్పు పట్టింది. ఖతార్లో వలస కార్మికుల కోసం అనేక చర్యలు చేపడుతున్నామనీ, దేశ అభివృద్ధిలో వలస కార్మికుల పాత్ర ఎనలేనిదని ఖతార్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వలస కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో నిత్యం తనిఖీలు జరుగుతుంటాయన్న ప్రభుత్వం, ఎక్కడా ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఉపేక్షించడంలేదనీ, సమస్యల పట్ల తీవ్రంగా స్పందిస్తున్నామని పేర్కొంది. కార్మికుల్ని ప్రొటెక్ట్ చేసేందుకు ఖతార్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ, జాతి నిర్మాణంలో కార్మికులు కీలక భూమిక పోషిస్తున్నారని స్పష్టంగా చెప్పింది. దేశ కీర్తి ప్రతిష్టలు దెబ్బతినేలా ఆమ్నెస్టీ రిపోర్ట్ ఉందని ఆక్షేపణ వ్యక్తం చేస్తూ, వేజ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ద్వారా కార్మికులు తగిన సమయంలో జీతాలు పొందుతున్నారని, అలాగే వారంతా సంతోషంగా తమ పనులు చేసుకుంటున్నారని చెప్పింది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









