వెయిట్ లిఫ్టర్ల హవా..భారత్ ఖాతాలో మరో స్వర్ణం
- April 08, 2018
భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో జరుగుతున్న 21వ ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్లో భారత వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతుంది. తాజాగా 69 కేజీల విభాగంలో పూనమ్ యాదవ్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఆదివారం ఉదయమే జరిగిన పోటీల్లో పూనమ్ 222 కేజీల బరువును ఎత్తి పసిడి పతకం సాధించింది. ఈ తాజా పథకంతో భారత పతకాల సంఖ్య ఏడుకు చేరుకుంది. ఐదు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పథకాలు భారత్ ఖాతాలో ఉన్నాయి. అయితే పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా పసిడి పతకం సాధించిన పూనమ్ యాదవ్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతితో సహా పలువురు ప్రముఖులు పూనమ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంతకుముందు 2014 గ్లాస్గోవ్ కామెన్వెల్త్ క్రీడల్లో పూనమ్ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







