వెయిట్ లిఫ్టర్ల హవా..భారత్ ఖాతాలో మరో స్వర్ణం
- April 08, 2018
భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో జరుగుతున్న 21వ ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్లో భారత వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతుంది. తాజాగా 69 కేజీల విభాగంలో పూనమ్ యాదవ్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఆదివారం ఉదయమే జరిగిన పోటీల్లో పూనమ్ 222 కేజీల బరువును ఎత్తి పసిడి పతకం సాధించింది. ఈ తాజా పథకంతో భారత పతకాల సంఖ్య ఏడుకు చేరుకుంది. ఐదు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పథకాలు భారత్ ఖాతాలో ఉన్నాయి. అయితే పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా పసిడి పతకం సాధించిన పూనమ్ యాదవ్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతితో సహా పలువురు ప్రముఖులు పూనమ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంతకుముందు 2014 గ్లాస్గోవ్ కామెన్వెల్త్ క్రీడల్లో పూనమ్ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







