వెయిట్‌ లిఫ్టర్ల హవా..భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం

- April 08, 2018 , by Maagulf
వెయిట్‌ లిఫ్టర్ల హవా..భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం

భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న 21వ ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌ లిఫ్టర్ల హవా కొనసాగుతుంది. తాజాగా 69 కేజీల విభాగంలో పూనమ్‌ యాదవ్‌ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఆదివారం ఉదయమే జరిగిన పోటీల్లో పూనమ్‌ 222 కేజీల బరువును ఎత్తి పసిడి పతకం సాధించింది. ఈ తాజా పథకంతో భారత పతకాల సంఖ్య ఏడుకు చేరుకుంది. ఐదు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పథకాలు భారత్ ఖాతాలో ఉన్నాయి. అయితే పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా పసిడి పతకం సాధించిన పూనమ్‌ యాదవ్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతితో సహా పలువురు ప్రముఖులు పూనమ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంతకుముందు 2014 గ్లాస్గోవ్‌ కామెన్‌వెల్త్‌ క్రీడల్లో పూనమ్ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com