ఫేస్ బుక్ వరద బాధితులకు బాసటగా ...

- December 03, 2015 , by Maagulf
ఫేస్ బుక్ వరద బాధితులకు బాసటగా ...

వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చెన్నై వాసులకు ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సంస్థ ఫేస్ బుక్ బాసటగా నిలిచింది. వరదలతో తమవారి క్షేమ సమాచారం గురించి బంధువులు, స్నేహితులు ఆందోళన చెందకుండా చెన్నై వాసుల స్టేటస్ ను తెలిపేలా సేఫ్టీ చెక్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ వలన చెన్నై వాసుల యూజర్ పేజీలో సేఫ్టీ చెక్ ఆప్షన్ వస్తుంది. దీనిలో సేఫ్ గా ఉన్నామని తెలిపుతూ క్లిక్ చేయడం ద్వారా ఆ సమాచారం బంధువులు, స్నేహితులకు ఆటోమెటిక్ గా చేరిపోతుంది. గతంలో పారిస్ దాడుల నేపథ్యంలో కూడా ఫేస్ బుక్ ఈ సదుపాయాన్ని కల్పించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com