బన్నీ కోసం 'అహం బ్రహ్మాస్మి'..
- April 10, 2018
గమ్యం, వేదం, కృష్ణం వందే జగత్ గురు, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి.. లాంటి విభిన్నమైన సినిమాలని తెలుగు ప్రేక్షలకు అందించిన దర్శకుడు క్రిష్. ప్రస్తుతం బాలీవుడ్ లో 'మణికర్ణిక' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత క్రిష్ మళ్లీ తెలుగులో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే కథని కూడా సిద్ధం చేసుకొన్నాడు. 'అహం బ్రహ్మాస్మి' అనే టైటిల్ ని కూడా ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేసుకున్నాడు. ఐతే, ఈ సినిమా ఏ టాలీవుడ్ స్టార్ తో తెరకెక్కించనున్నాడనే ఉత్కంఠ నెలకొంది.
ఇప్పుడీ ఉత్కంఠకు తెరపడినట్టు సమాచారమ్. క్రిష్ 'అహం బ్రహ్మాస్మి' కథని స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కోసం రాసుకొన్నాడట. త్వరలోనే బన్నీని కలిసి కథని వినిపించబోతున్నట్టు సమాచారమ్. బన్నీ కథని ఓకే చేయడమే తరువాయి సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్ లో క్రిష్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ 'నా పేరు సూర్య'తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయిన 'నా పేరు సూర్య' మే 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







