డేటా లీక్పై ప్రధాని
- April 11, 2018
న్యూఢిల్లీ : ఇంటర్నెట్, సోషల్ మీడియా దిగ్గజాలచే యూజర్ల సమాచారం బహిర్గతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారాన్ని పంచుకోవడాన్ని నియంత్రించాలని, దేశంలోనే ఆయా సర్వర్లు ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రధాని సూచించినట్టు అత్యున్నత వర్గాలు తెలిపాయి. ఫేస్బుక్, కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థలు యూజర్ల సమాచారన్ని బహిర్గతం చేసిన అంశం ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఇంటర్నెట్ దిగ్గజాల సర్వర్లు భారత్లోనే ఉండాలని ప్రధాని సూచించారని సమాచారం.
దీనిపై ఐటీ మంత్రిత్వ శాఖ గత వారం సమగ్ర సమీక్ష చేపట్టిందని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ సర్వర్లలో అత్యధికంగా యూజర్ల సమాచారం గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల్లో నమోదవుతోంది. ఈ సర్వర్లలో నిక్షిప్తమైన సమాచారం పొందాలంటే అమెరికన్ చట్టాలు, అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి వ్యవహరించాల్సిమ ఉంటుంది. యూజర్ల సమాచారాన్ని స్ధానికంగానే భద్రపరచాలని, దీనిపై గట్టి నియంత్రణ ఉండాలని ప్రధాని చేసిన సూచనను ఐటీ మంత్రిత్వ వర్గాలు పరిశీలిస్తున్నాయి. సమాచార రక్షణకు ప్రభుత్వం ఇతర మార్గాలనూ పరిశీలిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









