డేటా లీక్పై ప్రధాని
- April 11, 2018
న్యూఢిల్లీ : ఇంటర్నెట్, సోషల్ మీడియా దిగ్గజాలచే యూజర్ల సమాచారం బహిర్గతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారాన్ని పంచుకోవడాన్ని నియంత్రించాలని, దేశంలోనే ఆయా సర్వర్లు ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రధాని సూచించినట్టు అత్యున్నత వర్గాలు తెలిపాయి. ఫేస్బుక్, కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థలు యూజర్ల సమాచారన్ని బహిర్గతం చేసిన అంశం ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఇంటర్నెట్ దిగ్గజాల సర్వర్లు భారత్లోనే ఉండాలని ప్రధాని సూచించారని సమాచారం.
దీనిపై ఐటీ మంత్రిత్వ శాఖ గత వారం సమగ్ర సమీక్ష చేపట్టిందని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ సర్వర్లలో అత్యధికంగా యూజర్ల సమాచారం గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల్లో నమోదవుతోంది. ఈ సర్వర్లలో నిక్షిప్తమైన సమాచారం పొందాలంటే అమెరికన్ చట్టాలు, అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి వ్యవహరించాల్సిమ ఉంటుంది. యూజర్ల సమాచారాన్ని స్ధానికంగానే భద్రపరచాలని, దీనిపై గట్టి నియంత్రణ ఉండాలని ప్రధాని చేసిన సూచనను ఐటీ మంత్రిత్వ వర్గాలు పరిశీలిస్తున్నాయి. సమాచార రక్షణకు ప్రభుత్వం ఇతర మార్గాలనూ పరిశీలిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!









