షార్ట్ ఫిల్మ్లకు నంది అవార్డులు
- April 11, 2018
చలన చిత్ర, నాటక, టివి రంగంలో మాదిరిగా షార్ట్ ఫిల్మ్లకు కూడా నంది అవార్డులు ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డిసి) చైర్మన్ అంబికా కృష్ణ తెలిపారు. విజయవాడ ఎఫ్డిసి కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చలన చిత్ర, నాటక, టివి రంగాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం షార్ట్ ఫిల్మ్లను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అమరావతి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్-2017ను నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయవాడకు చెందిన డూండీ సర్వీసెస్ సహకారంతో ఈ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నామన్నారు. సమాజంలో వస్తున్న మార్పుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామన్నారు. యువతరాన్ని ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కేవలం తెలుగు భాషలో నిర్మించిన 5 నుంచి 20 నిముషాల నిడివి గల ఫిల్మ్లను మాత్రమే పంపాలని సూచించారు. వీటిని 2017 జనవరి 1 నుంచి డిసెంబరు 31 మధ్య యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉండాలన్నారు. రూ. 1000 ఎంట్రీ ఫీజు చెల్లించాలన్నారు. నిర్ణీత దరఖాస్తుతో పాటు ఫిల్మ్ను మే 15 లోగా ఎఫ్డిసి కార్యాలయంలో నేరుగా అందజేయాలన్నారు. ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ప్రత్యేకంగా నియమించిన జ్యూరీ 100 షార్ట్ ఫిల్మ్లను ఎంపిక చేస్తుందన్నారు. వీటిలో ప్రథమ బహుమతిగా లక్ష రూపాయలు, ద్వితీయ బహుమతిగా రూ. 50 వేలు, తృతీయ బహుమతిగా రూ.25 వేలతో పాటు ఇతర బహుమతులు కూడా అందజేస్తామన్నారు. ఈ ఫెస్టివల్ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







