వేసవి కాలంలో ఒంటిలోని వేడిని తగ్గించే ఒకే ఒక్క పండు..?
- April 13, 2018
కర్భూజ పండు. ఈ పండును ఇంగ్లీష్లో మస్క్ మిలన్ అంటారు. ఈ కాలంలో కర్భూజ పండు ఎక్కువగా లభిస్తుంది. ఈ పండులో పోషకాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు. ఇందులో పొటాషియం, కాల్షియం, విటమిన్ - సి, విటమిన్ - ఎ, ఫ్లోరిక్ ఆమ్లాలు, ఫైబర్ వంటి పోషకాలు ఉన్న ఈ పండును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి బోలెడు లాభాలు ఉన్నాయంటున్నారు.
ఎండాకాలంలో లభించే ఈ పండును తింటే శరీర వేడిని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒంటికి చలువ చేస్తుంది. ఇందులో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే పోషకాలు, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల అధిక బరువు ఉన్న వారు ఈ పండును తింటే మంచి ఫలితం ఉంటుందట.
కర్భూజ పండును తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను నివారిస్తుంది. అజీర్తి, ఎసిడిటీ, మలబద్దకం, ఆకలి అనిపించకపోవడం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఈ పండు శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు ఎముకలకు కావాల్సినన్ని పోషకాలకు అందించి ఎముకలను బలంగా మారుస్తుంది. ఇందులోని విటమిన్-సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఎండాకాలంలో త్వరగా అలసిపోవడం, నీరసంగా ఉండడం వంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఈ పండును తీసుకుంటే తొందరగా రికవరీ అవుతుంది. అలాగే కళ్ళకు కూడా బాగా సహాయపడుతుంది.
తాజా వార్తలు
- బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు..
- యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..
- 100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్ల జరిమానా
- మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి
- సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ సహకారానికి బహ్రెయిన్ పిలుపు
- సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్లు రద్దు
- కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- కేసీఆర్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి