వేసవి కాలంలో ఒంటిలోని వేడిని తగ్గించే ఒకే ఒక్క పండు..?
- April 13, 2018
కర్భూజ పండు. ఈ పండును ఇంగ్లీష్లో మస్క్ మిలన్ అంటారు. ఈ కాలంలో కర్భూజ పండు ఎక్కువగా లభిస్తుంది. ఈ పండులో పోషకాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు. ఇందులో పొటాషియం, కాల్షియం, విటమిన్ - సి, విటమిన్ - ఎ, ఫ్లోరిక్ ఆమ్లాలు, ఫైబర్ వంటి పోషకాలు ఉన్న ఈ పండును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి బోలెడు లాభాలు ఉన్నాయంటున్నారు.
ఎండాకాలంలో లభించే ఈ పండును తింటే శరీర వేడిని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒంటికి చలువ చేస్తుంది. ఇందులో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే పోషకాలు, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల అధిక బరువు ఉన్న వారు ఈ పండును తింటే మంచి ఫలితం ఉంటుందట.
కర్భూజ పండును తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను నివారిస్తుంది. అజీర్తి, ఎసిడిటీ, మలబద్దకం, ఆకలి అనిపించకపోవడం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఈ పండు శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు ఎముకలకు కావాల్సినన్ని పోషకాలకు అందించి ఎముకలను బలంగా మారుస్తుంది. ఇందులోని విటమిన్-సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఎండాకాలంలో త్వరగా అలసిపోవడం, నీరసంగా ఉండడం వంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఈ పండును తీసుకుంటే తొందరగా రికవరీ అవుతుంది. అలాగే కళ్ళకు కూడా బాగా సహాయపడుతుంది.
తాజా వార్తలు
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!