కూతురినే పెళ్లి చేసుకుని ఆపై..
- April 14, 2018
సమాజం ఎటు పోతోంది. వావి వరుసలు లేకుండా పోతున్నాయి. చేస్తున్న పని మంచిదా కాదా అని ఒక్క క్షణమైనా ఆలోచించట్లేదు. వాషింగ్టన్కు చెందిన ఓ వ్యక్తి కన్నకూతురితోనే వివాహ బంధాన్ని కొనసాగించి బిడ్డను కూడా కన్నాడు. ఆపై అనుమానంతో ఆమెను, బిడ్డను కాల్చి తానూ కాల్చుకుని మరణించాడు. వాషింగ్టన్ నార్త్ కరోలినాకు చెందిన స్టీవెన్ ప్లాదల్ తన కూతురు క్యాటీని పుట్టినప్పుడే న్యూయార్క్కు చెందిన ఆంటోనీ ఫస్కో అనే వ్యక్తికి దత్తత ఇచ్చాడు. అయితే క్యాటీకి తనని కన్న తల్లిదండ్రులని చూడాలనిపించి ఓ రోజు వారివద్దకు వచ్చింది. అలా అప్పుడప్పుడు వచ్చి పోతుండడం అలవాటైంది. ఈ క్రమంలో కన్న తండ్రి క్యాటీతో సన్నిహితంగా మెలగసాగాడు. క్రమంగా అది వారిద్దరి మధ్య శారీరక సంబంధానికి దారితీసింది. దాంతో ఇద్దరూ వివాహం కూడా చేసుకున్నారు. క్యాటీ ఓ బిడ్డకు తల్లి కూడా అయింది.
తండ్రీ కూతుళ్లు భార్యా భర్తలు కావడాన్ని సహించలేని సమాజం అతన్ని కోర్టుకు ఈడ్చింది. అతడిపై కేసు నమోదై జైలుకు కూడా వెళ్లవలసి వచ్చింది. శిక్షానంతరం జైలు నుంచి విడుదలైన స్టీవెన్ మళ్లీ క్యాటీకి దగ్గరయ్యాడు. అయితే స్టీవెన్ జైలులో ఉన్నప్పుడు క్యాటీ వేరొకరితో సంబంధం పెట్టుకుని ఉందన్న అనుమానం వచ్చింది అతడికి. క్యాటీ చర్యలతో అది కాస్తా బలపడింది. ఇదే విషయంపై వీరిద్దరి మధ్యా తరచూ గొడవలు కూడా జరుగుతుండేవి. గొడవ తీవ్రమవడంతో బుధవారం రాత్రి కొడుకు బెన్నెట్ను స్టీవెన్ చంపేశాడు. అనంతరం క్యాటీని, ఆమెను దత్తత తీసుకున్న తండ్రిని స్టీవెన్ ఓ వ్యానులో నిర్జన ప్రదేశానికి తీసుకు వెళ్లి కాల్చి చంపేశాడు. అనంతరం అతడు క్యాటీ తల్లికి హత్య చేసిన సమాచారాన్ని అందించాడు. సమాచారం అందుకున్న ఆమె వచ్చేలోపే తాను కూడా కాల్చుకుని మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాల్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









