నన్ను రేప్ చేసి చంపేస్తారు: లాయర్
- April 15, 2018కశ్మీర్లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలిక అసిఫాపై సామూహిక అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా కథువా రేప్ కేసులో మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బాధిత అసిఫా తరుపున వాదిస్తున్న లాయర్ దీపిక ఎస్ రాజావత్ తన ప్రాణాలకు హాని ఉన్నట్టు తెలిపింది. నేను ఎప్పటి వరకు బతికి ఉంటానో తెలియదు. నన్ను కూడా వాళ్ళు రేప్ చేసి చంపేస్తారు అని తెలిపింది. నా ప్రాణాలకు హాని ఉన్న విషయాన్ని నేడు సుప్రీం కోర్టుకు చెబుతా' అని దీపిక పేర్కొన్నారు.
తాజాగా లాయర్ దీపిక మాట్లాడుతూ.. కథువా కేసును వాదిస్తున్నందుకు జమ్ము బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బీఎస్ స్లాథియా హెచ్చరించినట్టు పేర్కొంది. జమ్ము బార్ అసోసియేషన్లో నేను సభ్యురాలిని కాను.. అయినా కూడా బుధవారం స్లాథియా ఈ కేసు నుంచి దూరంగా ఉండాలని నన్ను హెచ్చరించారు అని తెలిపింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్