నన్ను రేప్ చేసి చంపేస్తారు: లాయర్

- April 15, 2018 , by Maagulf
నన్ను రేప్ చేసి చంపేస్తారు: లాయర్

కశ్మీర్లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలిక అసిఫాపై సామూహిక అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా కథువా రేప్‌ కేసులో మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బాధిత అసిఫా తరుపున వాదిస్తున్న లాయర్ దీపిక ఎస్ రాజావత్ తన ప్రాణాలకు హాని ఉన్నట్టు తెలిపింది. నేను ఎప్పటి వరకు బతికి ఉంటానో తెలియదు. నన్ను కూడా వాళ్ళు రేప్ చేసి చంపేస్తారు అని తెలిపింది. నా ప్రాణాలకు హాని ఉన్న విషయాన్ని నేడు సుప్రీం కోర్టుకు చెబుతా' అని దీపిక పేర్కొన్నారు. 

తాజాగా లాయర్ దీపిక మాట్లాడుతూ.. కథువా కేసును వాదిస్తున్నందుకు జమ్ము బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బీఎస్ స్లాథియా హెచ్చరించినట్టు పేర్కొంది. జమ్ము బార్ అసోసియేషన్‌లో నేను సభ్యురాలిని కాను.. అయినా కూడా బుధవారం స్లాథియా ఈ కేసు నుంచి దూరంగా ఉండాలని నన్ను హెచ్చరించారు అని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com