'కథువా' ఘటనపై నేడు విచారణ
- April 15, 2018జమ్ము: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచారం, హత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మంది నిందితులపై విచారణ చేపట్టనున్నారు. నిందితులలో ఒక మైనర్ కూడా ఉన్నాడు. కథువా ప్రధాన న్యాయాధికారి ఏడుగురు నిందితులపై చార్జిషీటు నమోదుచేసి, విచారణ కోసం సెషన్స్ కోర్టుకు తరలించారు. ఈ కేసులో జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం ఇద్దరు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించింది. ఈనెల 13న సుప్రీంకోర్టు ప్రక్రియను అడ్డుకున్న జమ్ము, కథువా న్యాయవాదుల అసోసియేషన్పై కూడా విచారణ జరుపనుంది. న్యాయస్థానాలకు హాజరుకావద్దని ప్రధాన న్యాయమూర్తి దీపక్మిశ్రా, జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడసింగ్లతో కూడిన ధర్మాసనం జమ్ము హై కోర్టు బార్ అసోసియేషన్ను ఆదేశించింది. వారు చట్ట ప్రక్రియను అడ్డుకోలేరని సూచించింది. ఎనిమిది మంది నిందితులపై చార్జిషీటును నమోదు చేసిన క్రైం బ్రాంచ్ నలుగురు పోలీస్ అధికారుల పేర్లను కూడా చార్జిషీటులో పేర్కొంది. ముగ్గురు పోలీస్ అధికారులు సాక్ష్యాల్ని ధ్వంసంచేయడానికి రూ. 4 లక్షలు లంచం తీసుకున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం