గోల్డెన్ ట్రెజర్ మోసం: ఏడుగురి అరెస్ట్
- April 15, 2018
దోహా: సెక్యూరిటీ ఏజెన్సీస్, ఏడుగురు సభ్యుల ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. చారిత్రక సంపద అని చెబుతూ గోల్డ్ కాయిన్స్ని ఇస్తామని నమ్మించి, ఈ గ్యాంగ్ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు వివరించారు. ఖరీదైన స్మార్ట్ ఫోన్స్ని తక్కువ ధరకే విక్రయిస్తామని కూడా ఈ ముఠా చాలామందిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జమాల్ అల్ కాబి మాట్లాడుతూ, సిబిఐ ఈ ముఠాకి సంబంధించిన పలు ఫిర్యాదుల్ని అందుకుందనీ, అత్యంత పకడ్బందీగా వ్యూహ రచన చేసి ఈ గ్యాంగ్ని అరెస్ట్ చేశామనీ తెలిపారు. వృద్ధులు, మహిళల్ని ఈ గ్యాంగ్ టార్గెట్గా చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ గ్యాంగ్లో ఆసియాకి చెందిన ఏడుగురు సభ్యులున్నారు. ఖరీదైన మొబైల్ ఫోన్స్ కావొచ్చు, బంగారు ఆభరణాలు కావొచ్చు అలాంటివి తక్కువ ధరకు లభించే అవకాశం వుండదనీ, ఎవరన్నా అలాంటి ప్రతిపాదనలు తెస్తే పోలీసులను సంప్రదించాలని సిఐడి అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









