చెన్నైకి విమానాలు రద్దు చేసిన ఒమన్ ఎయిర్
- December 04, 2015
డిసెంబర్ 6 వరకూ చెన్నయ్కి విమానాల్ని రద్దు చేసినట్లు ఒమన్ ఎయిర్ అధికారికంగా ప్రకటించింది. వరదలతో చెన్నయ్ ఇబ్బందులు పడుతుండడం విమానాశ్రయం కూడా పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో విమానాలు చెన్నయ్లో దిగే పరిస్థితులు లేవు. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్నవారు రద్దయిన ప్రయాణాల్ని తిరిగి కొత్తగా ప్లాన్ చేసుకోవాలని ఒమన్ ఎయిర్ అధికారులు సూచించారు. టిక్కెట్లు పూర్తిగా రద్దు చేసుకోవాలనుకుంటే పూర్తిస్థాయిలో ఛార్జీలు రిఫండ్ చేయబడ్తాయనీ, ఎలాంటి రద్దు ఛార్జీలు ఉండబోవమని ఒబమన్ ఎయిర్ ప్రకటించింది. ఒకవేళ భారతదేశంలో ఇంకో నగరానికి వెళ్ళాలనుకుంటే తగిన విధంగా ఛార్జీలు సరిచేయబడ్తాయనీ, ప్రయాణీకులకు చెల్లించాల్సిన సొమ్ముని నగదు రూపంలో లేదా వోచర్స్ రూపంలో చెల్లించబడ్తుందని ఒమన్ ఎయిర్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







