చెన్నైకి విమానాలు రద్దు చేసిన ఒమన్ ఎయిర్
- December 04, 2015
డిసెంబర్ 6 వరకూ చెన్నయ్కి విమానాల్ని రద్దు చేసినట్లు ఒమన్ ఎయిర్ అధికారికంగా ప్రకటించింది. వరదలతో చెన్నయ్ ఇబ్బందులు పడుతుండడం విమానాశ్రయం కూడా పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో విమానాలు చెన్నయ్లో దిగే పరిస్థితులు లేవు. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్నవారు రద్దయిన ప్రయాణాల్ని తిరిగి కొత్తగా ప్లాన్ చేసుకోవాలని ఒమన్ ఎయిర్ అధికారులు సూచించారు. టిక్కెట్లు పూర్తిగా రద్దు చేసుకోవాలనుకుంటే పూర్తిస్థాయిలో ఛార్జీలు రిఫండ్ చేయబడ్తాయనీ, ఎలాంటి రద్దు ఛార్జీలు ఉండబోవమని ఒబమన్ ఎయిర్ ప్రకటించింది. ఒకవేళ భారతదేశంలో ఇంకో నగరానికి వెళ్ళాలనుకుంటే తగిన విధంగా ఛార్జీలు సరిచేయబడ్తాయనీ, ప్రయాణీకులకు చెల్లించాల్సిన సొమ్ముని నగదు రూపంలో లేదా వోచర్స్ రూపంలో చెల్లించబడ్తుందని ఒమన్ ఎయిర్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









