మే 17న రమదాన్: కువైటీ ఆస్ట్రనామర్ అంచనా
- April 22, 2018
పవిత్ర రమదాన్ మే 17న రావొచ్చునని కువైటీ ఆస్ట్రనామర్ అంచనా వేశారు. కువైట్లో క్రిసెంట్ మూన్ని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం లేదు. ఇది కేవలం టెలిస్కోప్ ద్వారా మాత్రమే కనిపిస్తుంది. వెస్ట్రన్ అరబ్ వరల్డ్ మాత్రం క్రిసెంట్ మూన్ని తిలకించే అవకాశం వుందని ఆస్ట్రనామర్ అదెల్ అల్ సాదౌన్ చెప్పారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ముస్లింలు ఉపవాస దీక్షలు చేపడుతుంటారు. ఈ ఉపవాస దీక్షలు ఆరోగ్యానికీ మేలు చేస్తాయని పలువురు వైద్యులు వెల్లడిస్తున్నారు. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం ఉపవాస దీక్షల పట్ల అప్రమత్తంగా వుండాలి. వైద్యుల సూచన మేరకు వారు ఉపవాస దీక్షలు చేయాల్సి వుంటుంది. వేసవి కావడంతో, సుమారు 15 గంటల పాటు ఉపవాస దీక్షలు కొంత కష్టతరమే. అయినప్పటికీ కూడా భక్తి శ్రద్ధలతో చేసే ఉపవాస దీక్షలతో తమకు మేలు జరుగుతుందని ముస్లింలు భావిస్తుంటారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







